టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ పాలనపై నిప్పులు చెరుగుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించిన చంద్రబాబు.. జగన్ పోలవరం ప్రాజెక్టును నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి సైకో పాలన వద్దూ.. సైకిల్ పాలన కావాలని.. అప్పుడే ప్రజల జీవితాలు బాగుంటాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు అంతా ఐక్యం కావాలని.. జగన్మోహన్ ఐరన్ లెగ్ పోలవరం మీద పడటంతో అది మాటాష్ అయిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.


ప్రాణ సమానంగా కాపాడుకున్న డయాఫ్రమ్ వాల్, పోలవరం ప్రాజెక్టులు గోదావరి పాలయ్యాయని.. ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చిన్న పిల్లని పెంచినట్లు పెంచుకొచ్చిన పొలవరాన్ని నీళ్లపాలు చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. 70ఏళ్ల తెలుగువారి కల సాకారం కాకుండా బహుళార్ధ సార్ధక ప్రాజెక్టును బ్యారేజీ గా మారుస్తున్నాడని.. పోలవరం నీటితో నేనొక్కడినే వ్యవసాయం చేసుకుంటానా? దీని వల్ల ఎవరికి లాభం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు.


జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదీ మిగల్చలేదని.. 5ఏళ్లలో రూ.2లక్షల కోట్ల పెట్టుబడులు, 5లక్షల ఉద్యోగాలు తీసుకొస్తే వాటిని తరిమేస్తున్నాడని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. తరిమేసినంత తేలిగ్గా పెట్టుబడులు తీసుకురావటం కుదరదని.. అప్పులు చేసే ముఖ్యమంత్రి సమర్థుడా లేక సంపద సృష్టించేవాడా అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. కులం పేరుతో అమరావతి రైతుల్ని చంపేసి రూ.2లక్షల కోట్ల ఆస్తిని నాశనం చేస్తున్నాడని.. తన స్వలాభం కోసం బటన్ నొక్కుకుంటూ 175 గెలిపించమంటున్నాడని.. టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు.


నాకంటే కార్యకర్తలే ఆవేశంగా ఉన్నారన్న చంద్రబాబు.. ఏలూరు నుంచి పోలవరం మీదుగా కొవ్వూరు వచ్చేసరికి నా నడుం దెబ్బతిందని అన్నారు. రహదారుల దుస్థితి తీవ్రతకు  ఉయ్యాల ప్రయాణం అద్దం పడుతోందని... జగన్మోహన్ రెడ్డి ప్రజల పాలిట బస్మాసుర మామ అని.. జగన్ లా నాకు వాలంటీర్లు, బ్లూ మీడియా లేకున్నా, కార్యకర్తలే కొండంత బలమని చంద్రబాబు అన్నారు. బాబాయ్ ని చంపిన వాడికి హుందాతనం ఎక్కడ నుంచీ వస్తుందన్న చంద్రబాబు.. జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోగా బాదుడే బాదుడుగా మారిందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: