దేశానికి గొప్ప నాయకుడిని ఇచ్చిన మాతృమూర్తి చనిపోతే దేశ ప్రధాని కూడా సామాన్య ప్రజలలా.. చాలా సామాన్యంగా అంత్యక్రియలు నిర్వహించడం గొప్ప విశేషమని పొగిడారు. ప్రధానమంత్రి మోడీ గారికి తన సంతాపం తెలియజేస్తున్నానని చంద్రబాబు నాయుడు పేర్కొనడం ఒక విచిత్రంగా చెప్పుకోవచ్చు. అంటే చంద్రబాబుగారిలో మార్పు వచ్చింది, కానీ తెలుగుదేశం పార్టీలోని కార్యకర్తల కన్నా ఒక ప్రత్యేకమైన సెక్షన్ కు సంబంధించిన వ్యక్తులు అంటే చంద్రబాబు నాయుడు కి సంబందించిన పార్టీ కన్నా చంద్రబాబునాయుడు కుటుంబం కన్నా చంద్రబాబునాయుడుని అభిమానించే వ్యక్తులకు మాత్రం చంద్రబాబునాయుడులో వచ్చిన మార్పు నచ్చడం లేదని అర్థమవుతుంది.
దానికి ఉదాహరణగా ఇటీవల ప్రధానమంత్రి గారి మాతృమూర్తి గారి మరణం, మాతృమూర్తి గారి అంత్యక్రియల్లో పార్థివ దేహాన్ని మోస్తున్న విషయంలో అది మోస్తున్నట్టు ఉందా.. నటిస్తున్నట్టుగా లేదా అనేటువంటి వ్యాఖ్యలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. బాబు బిజెపితో కలవాలనుకుంటే అది తన సొంత విషయంలోకి లెక్కలోకి రాదు.. తన ఒప్పుకోలుతో పాటు , ముందు తన పార్టీ క్యాడర్లోని నాయకులను కూడా ఒప్పించాలి.. కానీ అది జరుగుతుందో లేదో తెలియదు. మరోవైపు మోదీ సైతం బాబు పాత డైలాగులు అంత సులభంగా మర్చిపోతారా?