వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ప్రజలందరూ అభద్రత భావంతో బతుకుతున్నారని.. ఈ పరిస్థితి కొంతమంది వైసీపీ వారిలో కూడా ఉందని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని మరిచిపోయారని వసూళ్ల పర్వం తప్ప మరొకటి లేదని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇచ్చే పథకాలు నలుగురికి మాత్రమే అందుతున్నాయని.. అందుకే రాష్ట్ర మొత్తం ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురుచూస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు అంటున్నారు.
జగన్ ఇక తిరిగి రాకుండా ఎప్పుడు ఇంటికి పంపిద్దామని చూస్తున్నారన్న ప్రత్తిపాటి పుల్లారావు.. చిలకలూరిపేటలో ఉన్న మంత్రికి తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత లేదంటున్నారు. ఈ మంత్రి ఈసారి చిలకలూరిపేటలో పోటీ చేస్తే కౌంటింగ్ కూడా అవసరం లేదన్న ప్రత్తిపాటి పుల్లారావు.. ఎంత మెజారిటీ తెలుగుదేశం పార్టీకి వస్తుందో చూసుకోవడమే అన్నారు. కొత్త సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలోని ప్రతి ఒక్కరూ కసిగా పనిచేసి 2023లో చంద్రబాబును సీఎం సీటులో కూర్చోబట్టే దాకా అలుపెరగని పోరాటం చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు ఇచ్చారు.
రాష్ట్రంలో సైకో పాలనకు ప్రజలు చరమ గీతం పాడడానికి సిద్ధంగా ఉన్నారన్న ప్రత్తిపాటి పుల్లారావు.. యువ నాయకుడు లోకేష్ పాదయాత్ర అనగానే జగన్మోహన్ రెడ్డి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్నారు. రోజులు దగ్గరపడి జగన్ రెడ్డి పీఠం కదులుతుండడంతో వణుకు ప్రారంభమైందని.. లోకేష్ పాదయాత్ర లో యువత, మహిళలు, రైతుల గురించి ప్రాధాన్యత అంశాలుగా తీసుకొని ముందుకు సాగడం జరుగుతుందని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.