తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ క్యాడర్ కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల అంశం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల తెలంగాణ సీఎస్‌గా ఉన్న సోమేశ్‌ కుమార్‌ ను ఏపీకి పంపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మిగిలిన అధికారుల విషయంలో ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు బీజేపీ ప్రకటించింది. ఈ మేరకు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వివరాలు తెలిపారు. బ్యూరోక్రాట్స్ కి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్లి పని చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.


ఈ విషయం సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని.. కానీ 'క్యాట్' పేరు మీద సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 15 మందిని పంపకుండా అడ్డుకున్నారని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శించారు. మాజీ సీఎస్ తో పాటే ఇతరులను కూడా వారికి కేటాయించిన స్థానాల్లో పంపించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. ముందుగానే చేస్తే చాలా తప్పిదాలు జరిగేవి కావన్న దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు... డీజీపీని కూడా ఏపీ కేడర్ కు కేటాయించారని.. ఆయన్ని కూడా అక్కడికి పంపించాలనీ డిమాండ్ చేశారు.


తెలంగాణలో అనేక చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరుగుతున్నాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో కూర్చున్న వ్యక్తులే అవి చేపట్టడం సరికాదని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. సర్వే నంబర్ 78కి సంబంధించిన భూమిని ఇతరులకు కేటాయించడంపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు సూచించారు. 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం, 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయమా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు.


రంగారెడ్డి కలెక్టర్ అందరికీ ఒకే న్యాయం చేయడా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. చీఫ్ సెక్రటరీ దీనిపై చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్యే రఘునందన్ రావు.. దీనిపై సీఎస్ కు బహిరంగ లేఖ పంపిస్తున్నట్లు తెలిపారు. మాకు ప్రభుత్వం, ప్రగతి భవన్ గేట్లు ఎలాగూ తెరుచుకోవని.. మీరైనా మాకు అవకాశం ఇస్తారో లేదో అని లేఖ పంపిస్తున్నానని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr