ఇక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సహకరించాలని, పరీక్షలు ముగిసిన తర్వాత చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. దీనికి స్పందించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల అసోషియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ మట్లాడుతూ- "గత రెండున్నర సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన రూ. 315 కోట్లు మేర స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. దీంతో భవనాలకు అద్దె చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక 300కు పైగా కాలేజీలు మూతపడ్డాయన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన హల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం తప్పనిసరి చేయాలని కోరారు. జీఓ నెంబర్ 112 ప్రకారం ట్యూషన్ ఫీజును పెంచాలని డిమాండ్ చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షలు ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. మొత్తంమీద ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈనెల 25 నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది.
ఇక ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు పరీక్షల నిర్వహణకు సహకరించాలని, పరీక్షలు ముగిసిన తర్వాత చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. దీనికి స్పందించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీ యాజమాన్యాల అసోషియేషన్ అధ్యక్షుడు గౌరీ సతీష్ మట్లాడుతూ- "గత రెండున్నర సంవత్సరాల నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు సంబంధించిన రూ. 315 కోట్లు మేర స్కాలర్షిప్లు విడుదల కాకపోవడంతో ప్రైవేట్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారు. దీంతో భవనాలకు అద్దె చెల్లించలేక, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక 300కు పైగా కాలేజీలు మూతపడ్డాయన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల పరీక్షలకు సంబంధించిన హల్ టికెట్లపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకం తప్పనిసరి చేయాలని కోరారు. జీఓ నెంబర్ 112 ప్రకారం ట్యూషన్ ఫీజును పెంచాలని డిమాండ్ చేశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. పరీక్షలు ముగిసిన తర్వాత సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. మొత్తంమీద ఇంటర్ పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈనెల 25 నుండి ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై రాష్ట్ర విద్యాశాఖ దృష్టి సారించింది.