ఇక అన్ని కేజీబీవీల్లో 958 ఖాళీ టీచింగ్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ కె.వెట్రిసెల్వి డిసెంబర్ 3 వ తేదీన అన్ని జిల్లాల విద్యాధికారులను ఆదేశిస్తూ షెడ్యూల్‌ విడుదల చేయడం జరిగింది.ఇక ఈ పోస్టులను భర్తీ చేసి డిసెంబర్ 20 వ తేదీలోగా నివేదికలు పంపాలని పేర్కొనడం జరిగింది. అభ్యర్ధుల అర్హతలు, మెరిట్ ఇంకా రిజర్వేషన్ల ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇక వయస్సు విషయానికి వస్తే 42 ఏళ్లుగా నిర్దేశించడం జరిగింది. రిజర్వుడ్‌ అభ్యర్ధులకు గరిష్ట వయోపరిమితి వచ్చేసి 47 ఏళ్ల వరకు ఉంటుంది. కేజీబీవీల్లో పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో బోధన సాగుతున్నందున తప్పనిసరిగా అదే మీడియంలో బోధన సామర్థ్యం కలిగి ఉండాలి. అలా లేనివారి నియామకాలను రద్దు చేసి తొలగించడం జరుగుతుంది. ఇక టీచింగ్‌ సిబ్బంది నియామక ఉత్తర్వులను జిల్లా స్థాయిలో ఇంకా అలాగే ప్రిన్సిపాళ్ల నియామక ఉత్తర్వులు అనేవి రాష్ట్ర స్థాయిలో ఇస్తారు. అభ్యర్ధుల విద్యార్హతలు ఇంకా సాధించిన మార్కులు అలాగే అనుభవం ఇంకా రిజర్వేషన్ల వారీగా ప్రొవిజనల్‌ జాబితాను ఆయా జిల్లాల అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు ఇంకా డీఈవోలు విడుదల చేయడం జరుగుతుంది. ఇక ఈ అభ్యంతరాలను స్వీకరించి తుది మెరిట్‌ జాబితాని వెలువరించడం జరుగుతుంది.ఇక విద్యార్హతలు అలాగే నెలవారీ వేతనాల విషయానికి వస్తే..

ప్రిన్సిపాల్‌ (స్పెషలాఫీసర్‌): యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ, బీఈడీ చేసి ఉండాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హై స్కూల్ లలో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. జీతం వచ్చేసి రూ.27,755 ఉంటుంది.

సీఆర్టీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులతో పీజీ డిగ్రీ, మెథడాలజీలో బీఈడీ చేసి దానితో పాటు ఏపీటెట్‌ లేదా తత్సమాన పరీక్షలో అర్హత అనేది ఉండాలి. అలాగే ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ,స్కూల్లో ప్రిన్సిపాల్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. జీతం రూ.21,755

పీఈటీ: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ లేదా డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. యూజీడీపీఈడీ లేదా బీపీఈడీ/ఎంపీఈడీ శిక్షణతో పాటు ఏపీటెట్‌లో అర్హత అనేది ఉండాలి. రెండేళ్ల అనుభవం కూడా ఉండాలి.జీతం రూ.21,755

పీజీటీ: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం  మార్కులతో పీజీ డిగ్రీ ఇంకా అలాగే మెథడాలజీలో బీఈడీ అర్హతని సాధించి ఉండాలి.ఇక ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ స్కూళ్లలో పీజీటీగా రెండేళ్ల అనుభవం ఉండాలి. జీతం రూ.12,000

పీజీటీ వొకేషనల్‌: యూజీసీ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టులో కనీసం 50 శాతం  మార్కులతో పీజీ డిగ్రీ లేదంటే పీజీ డిప్లొమా చేసి ఉండాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన జూనియర్‌ కాలేజీ, హై స్కూల్లో పీజీటీ వొకేషనల్‌ పోస్టులో రెండేళ్ల అనుభవం ఉండాలి.జీతం రూ.12000.

మరింత సమాచారం తెలుసుకోండి: