ఏపీ ప్రభుత్వం విద్యార్థులు, తల్లిదండ్రుల ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఎదురు చూపులకు ఎట్టకేలకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ ఈరోజు 12పీఎం కు పదో తరగతి పరీక్షా ఫలితాల చేయడం జరిగింది. కాగా శనివారం కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డ ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా విజయవాడలో పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. రెండేళ్ల తర్వాత ఈ సంవత్సరం జరిగిన పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు బాగానే ఉత్తీర్ణత సాధించారు. అయితే విద్యార్థులు తమ ఫలితాల కోసం ఈ www.results.bse.ap.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి ఫలితాలు చూసుకోవచ్చని అధికారులు తెలియజేసారు.

అయితే గత రెండు మూడేళ్ళ నుండి  ప్రతీసారి విద్యార్థుల ఫలితాలను గ్రేడ్‌ల రూపంలో అందించగా... కానీ ఈసారి మాత్రం ఆ గ్రేడ్‌లకు బదులు గా ఎప్పటిలాగానే మార్కులను ప్రకటించారు. అయితే ఈ ఏడాది పరీక్షలకు మొత్తం 6,21,799 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో 414281 మంది ఉత్తీర్ణత సాధించారు. అంటే ఈ సారి 67.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. కాగా వీరిలో బాలురు 64.02 శాతం పొందగా, బాలికలు ఎక్కువగా 70.70 శాతం పాస్‌ అయ్యారు. ఇక రాష్ట్రంలో అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 78.30 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత పొందగా, అత్యల్పంగా అనంతపురంలో 49.70 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.

అంతేకాదు విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు గాను, ర్యాంకుల ప్రకటనలకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో గ్రేడ్ల విధానం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం దీనికి బదులు మార్కులను ప్రకటించడం జరిగింది. కాగా ఆర్మీ, అలాగే ఇతరత్రా ఉద్యోగాలు, ఇంకా  పై చదువుల ప్రవేశాలకు మార్కులు అవసరమవుతున్నాయని అందుకే గ్రేడ్ల విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. కాగా 2022 ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 విద్యార్థులు హాజరవ్వగా..  మొత్తం రాష్ట్ర  వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. అయితే ఇప్పుడు ఇక జూలై మొదటి లేదా రెండో వారంలో అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: