ఏపీ విషయానికి వస్తే ఈ కడుపు మంట రాజకీయం మితి మీరిపోయినట్టుగా కనిపిస్తోంది. తాము అధికారంలో ఉండగా ప్రజలకు ఏమి చేసాము అన్న సంగతి మరిచిపోయి మరీ ఇప్పుడు చిత్తశుద్ధితో ప్రజల సంక్షేమం కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని అడుగడుగా అడ్డుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు పడుతున్న పాట్లు చూసి జనాల్లో సానుభూతి వస్తుందని వారు భావిస్తున్నా ప్రజల్లో మాత్రం తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వాళ్ళు ఎలాగూ చేయలేదు చేసేవాడిని చెడగొట్టడం ఎందుకు అనే భావన వారిలో కనిపిస్తోంది. అసలు ఏపీ ప్రభుత్వం ఏదైనా కొత్త పథకం కానీ, నిర్ణయం కానీ తీసుకుంటే అది ప్రజలకు ఎంత వరకు ఉపయోగపడుతుంది అని తెలుసుకోకుండా బురద చల్లేందుకు ప్రయత్నించడమే విమర్శలపాలవుతోంది.
కేవలం రాజకీయమే కావలి. ప్రజలు ఎలా పోతే మాకేంటి అన్నట్టుగా నేడు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నించడం విమర్శలపాలవుతోంది. తెలుగుదేశం నాయకులు వ్యవహరిస్తున్నట్టుగానే జనసేన అధినేత పవన్ కూడా ఇదే రకంగా నడుచుకోవడం విడ్డూరంగా కనిపిస్తోంది. నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పు అని ఖండించడంలో తప్పు లేదు కానీ ప్రజలకు ఉపయోగపడే విషయాలపైన కూడా అదే రకంగా బురద చల్లేందుకు ప్రయత్నించడమే ఇక్కడ చర్చకు వస్తోంది.
నిజంగా తప్పు జరిగినప్పుడు తప్పు అని మంచి చేస్తున్నప్పుడు మంచి అని మాట్లాడితే ప్రజల్లో కూడా ప్రతిపక్ష పార్టీల మీద గౌరవం పెరుగుతుంది అలా కాకుండా తాము అధికారంలో ఉండగా చేయలేని మంచి పనులు ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందనే కోపంతో విమర్శలు చేస్తుండడంతో ఉన్న గౌరవం కూడా వారు కోల్పోతున్నారు.
ReplyForward
|