ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఏబీఎన్, ఆంధ్రజ్యోతి మీడియాకు, వైసీపీ నాయకులకు మధ్య జరిగే యుద్ధం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఎన్నికలు రెండేళ్లు ఉన్నాయన్నప్పటి నుంచే వైసీపీపై జ్యోతి రాధాకృష్ణ తీవ్రమైన వ్యతిరేక వార్తలతో విషం చిమ్ముకుంటూ వెళ్లిపోయారు. జ్యోతిలో కనీసం రెండు రోజులకు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన రేపో మాపో జరుగుతోంది.. వైసీపీకి భవిష్యత్తు లేదు అంటూ వైసీపీలో ఎవ్వరూ ఉండకుండా ఉండేందుకు కంకణం కట్టుకని మరీ పనిచేశారు. ఇంకా చెప్పాలంటే నాడు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడం వెనక రాధాకృష్ణ మధ్యవర్తిత్వం చేశారని కూడా వైసీపీ నేతలు అప్పట్లో తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక అప్పటి నుంచే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాధాకృష్ణపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. అన్నట్టు విజయసాయి ఆర్కేకు కిరసనాయిలు అని పేరు కూడా పెట్టారు. విజయసాయి పెట్టిన కిరసనాయిలు పేరు ఆర్కేకే అన్నది ఓపెన్ సీక్రెట్. ఆర్కే గతంలో తాను నిజామాబాద్ జిల్లాలో కిరసనాయిలు అమ్మానని పేర్కొన్నారు. ఇక ఆర్కే తన కొత్తపలుకులో వీలున్నప్పుడల్లా విజయసాయిని విమర్శిస్తూ వస్తుంటారు. ఇక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాక కూడా విజయసాయి ఆర్కేను వదల్లేదు. పదే పదే కిరసనాయిలు అంటూ ట్వీట్లు చేయడంతో పాటు తనకు ఎక్కడ వీలున్నా ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని టార్గెట్గా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఇక రెండు, మూడేళ్లుగా చూస్తే విజయసాయి మీడియా సమావేశాలకు ఆంధ్రజ్యోతిలో కాని.. ఏబీఎన్ ఛానెల్లో కాని ఎంత మాత్రం ప్రయార్టీ ఉండేది కాదు. విజయసాయి వార్తలు అసలు ఆంధ్రజ్యోతిలో వచ్చేవే కావు. ఒకవేళ వచ్చినా లోపల పేజీల్లో చిన్న కాలమ్తో సరిపెట్టేవారు. ఇక ఛానెల్లో విజయసాయిపై వ్యతిరేక వార్తల కోసం మినహా పాజిటివ్గా ఆయన ఫొటో, విజువల్స్ చూపించే వారే కాదు. ఇక కొద్ది రోజులుగా చూస్తే విజయసాయి విషయంలో ఆర్కే మీడియా సంస్థల తీరు పూర్తిగా మారిపోయింది. ఇక సోమవారం విజయసాయి ప్రెస్మీట్ను ఏబీఎన్ ఛానెల్ కంప్లీట్గా చూపించింది.
ఇక ప్రెస్మీట్లో విజయసాయి చంద్రబాబు చాలా కుట్రలు చేస్తున్నారని.. వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై ఎవరు కేసులు పెట్టినా తాము వారి వెనక ఉంటామని చెప్పారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన సోషల్ మీడియా కేసులతో కార్యకర్తలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని... ఇక నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై సుప్రీంకోర్టుకు కూడా వెళతామని విజయసాయి చెప్పారు. ఓవరాల్గా ప్రెస్మీట్లో ప్రస్తుతం బాబోరికి బూస్టప్గా ఉన్న నిమ్మగడ్డను టార్గెట్ చేయడంతో పాటు చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మామూలుగానే ఏబీఎన్లో విజయసాయి ప్రెస్మీట్లు పాజిటివ్ కోణంలో చూపించరు... అలాంటిది చంద్రబాబును తిట్టిన ప్రెస్మీట్ ను కూడా ఇంత సేపు చూపించారంటే మొత్తానికి విజయసాయికి రాధాకృష్ణ జై కొడుతున్నారా ? సరెండర్ అవుతున్నారా ? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనతో నాకు గొడవెందుకు అనుకుంటున్నారా ? అన్నది ఆయనకే తెలియాలి.
విశాఖపట్నంలో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
— Vijayasai reddy v (@VSReddy_MP) June 1, 2020
Video: https://t.co/ozXmVHJuW2 pic.twitter.com/KNDmHcCcv8