సినీ తారలు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఎంతోమంది అగ్రతారలు, నటులు రాజకీయాల్లోకి వచ్చారు. తమకున్న గ్లామర్ తో, చరిష్మా తో ప్రేక్షకుల్ని ఆకట్టుకోని కొందరు విజయం సాధిస్తే, మరికొందరు ఫెయిల్ అవుతారు. కొందరు సొంతంగా పార్టీలు పెడితే, మరికొందరు వేరే పార్టీల్లో చేరి వీరి గ్లామర్ ను ఆ పార్టీకి జత చేస్తారు. ఇప్పటికే ఇలా రాజకీయాల్లోకి వచ్చిన వారు ఎందరో ఉన్నారు. సొంతంగా పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి తన సత్తా చాటిన ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఉన్నారు. పార్టీ పెట్టిన కొద్ది కాలానికే దాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసినటువంటి చిరంజీవి లాంటి వారు ఉన్నారు. అలాగే పార్టీ పెట్టి ప్రతీ ఎన్నికల్లో ఒక్కొక్కరికి మద్దతు పలికే పవన్ కళ్యాణ్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇకపోతే నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం ఎమ్మెల్యే గా ఉన్నారు. అలాగే ఎంతోమంది నటీనటులు తమకు నచ్చిన పార్టీలో చేరి ఆ పార్టీ అభివృద్ధికి తోడ్పడుతున్నారు.

 

తాజాగా ఇప్పుడు ఇదే బాటలో యాంకర్ అనసూయ వెళ్ళడానికి సన్నాహాలు చేస్తోందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. అటు బుల్లితెరపై, ఇటు వెండితెరపై రాణిస్తున్న రంగమత్త రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీతో పాటు పలు పార్టీలు ఆమెను తమ పార్టీలో చేరమని అడిగినట్టు సమాచారం. అదేవిధంగా కేంద్రం, రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ నేతలు అనసూయతో  చర్చలు జరిపినట్టు సమాచారం. అయితే రాజకీయ ఆరంగేట్రంపై అనసూయ తన సన్నిహితులతో చర్చిస్తోందని సమాచారం. కెరీర్ పీక్‌లో ఉన్న ఈ సమయంలోనే ఎలాంటి అడుగైనా ధైర్యంగా వేయాలనే కోణంలో అనసూయ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు అనసూయ రాజకీయాలకు వెళ్లడం సరికాదని అంటున్నారు. కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు ఈ రాజకీయాలకు జోలికి వెళ్లకుండా ఉంటనే మంచిదని అంటున్నారు. మొత్తంగా అనసూయ తన రాజకీయ ఎంట్రీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇకపోతే అనసూయ ప్రస్తుతం పవన్ కళ్యాణ్, క్రిష్ సినిమాలో ఒక ముఖ్యపాత్రలో నటించబోతున్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: