జూన్ 10వ తేదీన నందమూరి నటసింహం బాలకృష్ణ 60 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నారు. దీంతో కుటుంబసభ్యులు బాలయ్యకు షష్టిపూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ వేడుకకు అన్నీ తామే అయి చూసుకుంటున్నారట నందమూరి వారసులు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్. నిజంగా ఇది నందమూరి అభిమానులకి కన్నులపండుగే అని చెప్పాలి. ఈ వేడుకలో భాగంగా బాలయ్య నివాసంలో ఓ భారీ విందు ఏర్పాటు చేస్తున్నారు. కరోనా వైరస్ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా, ఆ విందుకు నందమూరి కుటుంబంతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారని సమాచారం. ఇక ఈ ఈవెంటుకు చిరంజీవి కూడా రాబోతున్నారని తెలుస్తుంది.

 

ఇటీవల సినిమా షూటింగుల విషయమై... టాలీవుడ్ ప్రముఖులు తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన విషయం తెలిసింది. ఈ భేటీపై బాలయ్య అసంతృప్తి వ్యక్తం చేశారు. తనను ఎవరూ పిలవలేదన్నారు. అయితే ఈ విషయంలో చిరు, బాలయ్య మధ్య మనస్పర్థలు తలెత్తాయని టాలీవుడ్‌లో టాక్ నడిచింది. అయితే తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేందుకు బాలయ్య స్వయంగా చిరుని ఆహ్వానించారని సమాచారం. ఇదే క్రమంలో బాలయ్యతో ఎలాంటి సమస్యలూ లేవని చెప్పేందుకు చిరంజీవి కూడా ఈ షష్ఠిపూర్తి వేడుకకు హాజరు అవుతారని మెగా కాంపౌండ్ నుంచి సంకేతాలు వస్తున్నాయి. అప్పట్లో చిరంజీవి 60వ జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. ఇండియాలోని అన్ని ఇండస్ట్రీల నుంచి ప్రముఖులు అంతా వచ్చారు. సినీ రాజకీయరంగ ప్రముఖులతో చిరు 60వ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. కాకపోతే కరోనా నేపధ్యంలో బాలకృష్ణ కొంతమందితో మాత్రమే ప్లాన్ చేస్తున్నారాట. అందుకే 9 వ తేదీ చిరు నేతృత్వంలోని సినీ ప్రముఖులు కొందరు సీఎం జగన్ తో భేటీ కానున్నారు. ఈ భేటీకి బాలయ్యను ఆహ్వానించినా బాలయ్య రానని చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: