మానవత్వం మంటకలిసిపోతుంది. అమ్మ అనే పదానికి అర్ధం లేకుండా పోతుంది. కన్న తల్లే కడుపున పుట్టిన బిడ్డల్ని కడతేరుస్తుంది. ఎక్కడో ఒక తల్లి చేసే నీచపు పనికి తల్లి అనే పదమే కలంకం వస్తుంది. తాజాగా సింగిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన నాగమణికి ఇద్దరు బిడ్డలు ఉన్నారు. అయితే తరచూ ఈమెకి భర్తతో గొడవలు జరుగుతుండేవి. నిత్యం ఈమెను భర్త వేధింపులకి గురి చేస్తుండేవాడు. ఆ క్రమంలో సూర్యాపేటకు చెందిన గట్టు మధు అనే ఆటో డ్రైవర్‌తో నాగమణికి అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త వేధింపులకు గురిచేస్తుండటంతో నాగమణి పిల్లలను అడ్డుతొలగించుకొని, అవివాహితుడైన మధును వివాహం చేసుకోవాలని పథకం రచించింది.

 

పథకం ప్రకారం పిల్లల్ని తీసుకొని సూర్యాపేట సద్దుల చెరువు కట్టపైకి చేరుకుంది. పిల్లల్ని అందులో తోసేసి చంపేసింది. అనంతరం అక్కడి నుంచి ప్రియుడితో పరారైంది. మొదట్లో అందరూ భర్త వేధింపులు బరించలేక పిల్లలతో కలిసి నాగమణి ఆత్మహత్య చేసుకుందని భావించారు. కాని చెరువులో పిల్లల మృతదేహాలు మాత్రమే దొరకడంతో కొంచం అనుమానం మొదలైంది. పోలీసులు సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలించగా అసలు విషయం తెలిసిపోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడితో పారిపోయిన నాగమణిని పట్టుకున్నారు. చేసేదేమి లేక ఆమె నిజం ఒప్పుకుంది. తన ప్రియుడు తన కోసం ఇంటికి వచ్చినప్పుడల్లా ఇంట్లో పిల్లలు ఉండటం చూసి నిరుత్సాహ పడుతున్నాడాని, అతని సలహా మేరకే పిల్లని చంపేశానని చెప్పింది.

 

దీంతో పోలీసులు అతన్ని కూడా పట్టుకొని స్టేషన్‌కి తెచ్చారు. కేసు రాసి ఇద్దర్నీ అరెస్టు చేసి... రిమాండ్‌కు తరలించారు. అసలు ఆ కసాయి తల్లికి ఆ పిల్లలని చంపటానికి చేతులు ఎలా వచ్చాయో అర్ధం కావట్లేదు. అడ్డదార్లు తొక్కలన్న ఆలోచన ఉన్న అలాంటి ఆడడానికి పెళ్లి ఎందుకు, పిల్లలు ఎందుకు అసలు నాకు అర్ధం కావట్లేదు. అసలు ఈమె పిల్లలని సరిగ్గా చూడలేని ఆ ప్రియుడు.. ఆమెను మాత్రం మోజు తిరగానే వదిలేయకుండా ఉంటాడా.? సొంత పిల్లలనే చంపిన ఆ కసాయి దానికి, రేపు వేరేవరికోసమో ఆ ప్రియుడిని చంపడం పెద్ద లెక్కా.? కామంతో కళ్ళు  మూసుకుపోయిన ఇలాంటి వారు చేసే పనులు చూస్తుంటే మన సంస్కృతి ఎక్కడికి పోతుందోనన్న భయం వేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: