టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని దెబ్బ కొట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆదర్శంగా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యూహం కూడా రచించినట్టు సమాచారం.

 

2014 ఎన్నికల తర్వాత తెలంగాణలో టీడీపీకి తగిలిన దెబ్బ మామూలు దెబ్బ కాదు.. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు ఆ పార్టీ నుంచి గెలిచిన నేతలంతా టిఆర్ఎస్ లోకి చేరిపోయారు. దీంతో తెలంగాణ టీడీపీ పరిస్థితి అందకారంలో పడిపోయింది. అయితే ఆ పార్టీలోకి వచ్చినోళ్లు ఎంతోమంది ఉన్నా.. మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ మాదిరి అదృష్టం ఉన్నోళ్లు మాత్రం పెద్దగా కనిపించరు. కేసీఆర్ లాంటి అధినేత మనసు దోచుకోవటం.. వేరే పార్టీలో ఎమ్మెల్యేగా ఉంటూ.. మంత్రి పదవిని చేపట్టటం.. ఒక్క తలసానికే సాధ్యం. అలాంటి సుడి అందరికి ఉండదు. కేసీఆర్ కూడా తలసాని తో చంద్రబాబుకి చెక్ పెట్టేశారు. అందుకు నిదర్శనం ప్రతిదానికి చంద్రబాబుపై తలసాని కాలు దువ్వడం. చంద్రబాబు ఏం మాట్లాడినా సరే తలసాని వెంటనే రంగంలోకి దిగి చంద్రబాబుకి కౌంటర్లు ఇస్తారు.

 

తెలంగాణలో ఆయన మాదిరే ఏపీలోనూ అలాంటి నేత ఒకరున్నట్టు తెలుస్తుంది. ఆయనే డొక్కా మాణిక్య వరప్రసాద్. మొదట కాంగ్రెస్ లో ఉన్న ఆయన.. ఆ తర్వాతి కాలంలో టీడీపీలోచేరారు..అక్కడకూడా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ సర్కారు స్టాండ్ కు అండగా నిలిచిన ఆయన ఇటీవలే తెలుగుదేశం పార్టీకి.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. పార్టీలోకి చేరీ చేరగానే పదవి కన్ఫర్మ్ కావటం చాలా తక్కువమందికే సాధ్యం. అలాంటి మేజిక్ డొక్కా సొంతం. తాజాగా మరోసారి ఎమ్మెల్సీ అవకాశాన్ని సొంతం చేసుకోవటం.. జగన్ లాంటి అధినాయకుడి మనసు దోచుకోవటం మామూలు విషయం కాదు. ఇప్పుడు సీఎం జగన్ కూడా డొక్కా మాణిక్య వరప్రసాద్ తో చంద్రబాబుకి చెక్ పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. అధికారపక్షం గురించి చంద్రబాబు ఏం మాట్లాడినా సరే డొక్కా మాణిక్య వరప్రసాద్ తో దానికి సమాధానం చెప్పించేందుకు జగన్ చూస్తున్నారట. ఇలా చేయడం ద్వారా చంద్రబాబు ఇమేజ్ మరింత డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని జగన్ భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: