దేశంలో అత్యాచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. కామంతో కళ్ళు మూసుకుపోయిన కొందరు నరరూప రాక్షసులు సొంతవారినే చిదిమేస్తున్నారు. ఒకడు తల్లిని, మరొకడు తోబుట్టువుని, ఇంకోకడు కడుపున పుట్టిన కూతుర్ని ఇలా వావివరసలు మర్చిపోయి మృగాళ్ల మీద పడిపోతున్నారు ఈ కామాంధులు. మరికొంతమంది తమ కర్తవ్యాలను మర్చిపోయి మరి రెచ్చిపోతున్నారు. బాధ్యత గల వృత్తిలో ఉంటూ.. నీచపు పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఒడిశాలోని సుందర్‌గఢ్‌ జిల్లా బీరమిత్రపూర్‌లో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం..

 

ఈ నెల 14న బీరమిత్రపూర్‌ పట్టణం బస్టాండులో అనారోగ్యంతో అచేతనంగా పడి ఉన్న 13 ఏళ్ల బాలికను శిశు సంక్షేమ కమిటీ సభ్యులు ఆదుకున్నారు. బాలికను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. దీంతో ఆమెను పరీక్షించిన వైద్యులు బాలికకు అబార్షన్‌ జరిగినట్లు తెలిపారు. ఆమె ఆరోగ్యం కుదుటపడిన అనంతరం విచారించగా బీరమిత్రపూర్‌ ఠాణా అధికారి, మరో పోలీసు, తన సవతి తండ్రి, ఆయన స్నేహితుడు కలసి పలుమార్లు తనపై అత్యాచారం చేశారని బాలిక అధికారులకు తెలిపింది.

 

4 నెలలుగా శారీరకంగా హింసిస్తున్నారని, గర్భం దాల్చిన తనకు బలవంతంగా అబార్షన్‌ చేయించి బస్టాండ్‌ లో వదిలి వెళ్లారని తెలిపింది. దీంతో నలుగురిపై ఎస్పీ సౌమ్యమిశ్రకు ఫిర్యాదు చేశారు. తక్షణమే స్పందించిన ఎస్పీ మహిళా డీఎస్పీతో కూడిన అధికారుల బృందంతో దర్యాప్తు చేయించారు. ఇలాంటి ఘటనలు చూడడం మనకేం కొత్త కాదు. ఎందుకంటే వయసుతో సంబంధం లేకుండా అప్పుడే పుట్టిన పసికందు నుంచి, కాటికి కాలు చాచిన పండు ముసలి వరకు ఎవరిని వదలట్లేదు ఈ కమాంధులు.

 

కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ సవతి తండ్రే ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. రక్షణగా ఉండాల్సిన పోలీసులే ఆమె పాలిట యమ భటులుగా మారారు. జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పోలీస్ వ్యవస్థ మీద గౌరవం ఉంటుందా.. ఎక్కడో ఒకడు చేసే పనికి పోలీస్ వ్యవస్థ పరువు మొత్తం పోతుంది. ఇకనైనా మారండి. ఆడదాన్ని గౌరవించండి.. ఆడదాన్ని కాపాడండి.

మరింత సమాచారం తెలుసుకోండి: