కొన్ని చోట్ల టిఆర్ఎస్ మరికొన్ని చోట్ల
బిజెపి, కొన్నిచోట్ల
టిడిపి ఎంఐఎం కొన్ని కొన్ని ప్రాంతాల్లో పట్టు పెంచుతున్నట్లు గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా
టీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీగా ఇక్కడ తలపడుతున్నాయి. గ్రేటర్ పీఠం టిఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం కావడంతో, ఆ
పార్టీ అగ్ర నాయకులు అందరూ రంగంలోకి దిగిపోయారు. ఎమ్మెల్యేలు ఎంపీలు, మంత్రులు ఎంపీటీసీలు , జడ్పీటీసీలు అందరూ ఎన్నికల బాధ్యతలు తీసుకుని తమ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా గ్రేటర్ లో సత్తా చాటాలని చూస్తున్నారు.
బిజెపి జాతీయ నాయకులను ఎన్నికల ప్రచారంలో కి దింపి గట్టిగానే ప్రచారం చేయించింది. ఇప్పుడు అధికారం దక్కించుకోబోయే
పార్టీ వైపే సార్వత్రిక ఎన్నికల ఫలితం కూడా ఉండే అవకాశం ఉండడంతో ఇంతగా ఇక్కడి ఎన్నికలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తున్నాయి.