ఇప్పుడు అదే
రాయలసీమ ప్రాంతానికి చెందిన
టిడిపి నాయకులు విమర్శలకు గురవుతున్నారు. అనేక కేసుల్లో ఇరుక్కున్నారు. తెలంగాణలో వారిపై కేసులు నమోదు అవుతున్నాయి. అయినా వారి విషయంలో చంద్రబాబు ఎక్కడా నోరుమెదపడం లేదు. పైగా
వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ హడావుడి సృష్టిస్తున్నారు. ఇటీవల
కడప జిల్లాకు చెందిన
టిడిపి ఎమ్మెల్సీ
దీపక్ రెడ్డి హైదరాబాదులో భూ వ్యవహారంలో వివాదాస్పదం కావడం, తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేయడం వంటివి జరిగాయి. ఆయన అరెస్టు తర్వాత
టిడిపి అధినేత చంద్రబాబు ఎక్కడా ఆయన గురించి ప్రస్తావించలేదు. ఇక ఇదే సమయంలో
టీడీపీ మాజీ
మంత్రి భూమా అఖిలప్రియ కిడ్నాప్ వ్యవహారంలో
అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లారు. ఈ విషయంపై ఇప్పటికీ చంద్రబాబు స్పందించలేదు. పైగా
వైసీపీ ప్రభుత్వం పై అదే తరహా విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పదే పదే
వైసీపీ ప్రభుత్వం పై ఈ తరహా విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి వ్యవహారాల్లో
టిడిపి నేతలు
అరెస్ట్ కావడం, జైలు పాలు అవ్వడం వంటి వ్యవహారాలు టిడిపికి ఇబ్బందికరంగా మారాయి.
బాబు ఏ విమర్శలు అయితే
జగన్ ప్రభుత్వం పై చేస్తున్నారో అదే తరహా విమర్శలు
టిడిపి నేతలపై వస్తూ ఉండటం వంటి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికీ విమర్శల రాజకీయాన్ని నమ్ముకుని బాబు ముందుకు వెళ్తున్నారు తప్ప, పార్టీపరంగా క్షేత్రస్థాయి నుంచి ఉత్సాహం రేకెత్తించి రాబోయే అన్ని ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే విషయం పైన దృష్టి పెట్టకుండా చౌకబారు విమర్శలు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ సొంత
పార్టీ నేతలు చేస్తున్న తప్పిదాలను కూడా పట్టించుకోకుండా ఉండడం వంటివి వ్యవహారాలు ఆయన హుందాతనాన్ని దెబ్బతీసేదిగా ఉన్నాయి.