యుద్ధం ఎలా జరిగినా సరే.. ధర్మ యుద్ధమే చేయాలనుకునే వారు కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం యుద్ధం ఎలా జరిగినా సరే.. విజయమే ప్రధానం అనుకుంటారు. చైనా ఈ రెండో తరహాకు చెందుతుంది. ఆ దేశం ఇప్పటికే ప్రపంచాన్ని కరోనా వంటి వైరస్‌లతో చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టం కలగజేసింది. ఇది చైనా సృష్టించిన మారణహోమమే అనే వారూ ఉన్నారు. అయితే ఆ విషయం నిరూపితం కాబట్టి పూర్తిగా ఓ నిర్థారణకు రాలేం.


కానీ ఇప్పుడు చైనాకు సంబంధించిన మరో పరోక్ష యుద్ధం గురించిన వాస్తవాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ యుద్ధం ఏంటో తెలుసా.. మీడియా యుద్ధం.. మీడియా యుద్ధం అంటే మీడియాపై యుద్ధం కాదు.. మీడియా ను ఉపయోగించి యుద్ధం.. అవును.. ఇప్పుడు చైనా ఈ కొత్త తరహా యుద్ధం చేస్తోంది. అది కూడా భారత్, అమెరికా లక్ష్యంగా ఈ యుద్ధం చేస్తోంది. ఎలాగంటారా... అమెరికా, ఇండియాలోని మీడియా హౌజ్‌లను ప్రభావితం చేసి.. తమ అభిప్రాయాలను.. తమకు అనుకూలమైన కథనాలను, అమెరికా, భారత్‌లకు వ్యతిరేకంగా కథనాలను వండి వార్చేలా ప్రోత్సహిస్తుందన్నది తాజా విశ్లేషణ.


ఈ వాదనకు సపోర్టుగా కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. ఇటీవల ఓ రక్షణ రంగ నిపుణుడు ఈ విషయంపై పెట్టిన ఓ పోస్టు ఆలోచింపజేస్తోంది. యూఎస్‌ జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌ అందిస్తున్న సమాచారం ప్రకారం.. అమెరికన్ మీడియాకు చైనా... అక్షలారా 19 మిలయన్ డాలర్లు ప్రకటనల రూపంలో చెల్లించిందట. ఇందులో వాల్‌ స్ట్రీట్ జర్నల్‌కు ఆరు మిలయన్ డాలర్లు... వాషింగ్టన్‌ పోస్టుకు 4 మిలియన్ డాలర్లు.. ట్విట్టర్‌కు ఇచ్చింది.. 2.6 లక్షల డాలర్లు చైనా  ఇచ్చిందట. ఇవే కాకుండా ఇంకా అనేక పత్రికలకు  ప్రకటనల రూపంలో చైనా భారీగా ముట్టజెపుతోందట.


అలాగే ఇండియాలోని పత్రికలకు కూడా చైనా ప్రకటనల రూపంలో డబ్బు అందిస్తోంది. ద హిందూ, స్క్రోల్, ద క్వింట్, న్యూస్‌ లాండ్రీ, ద వైర్ వంటి పత్రికలు, వెబ్ పోర్టళ్లకు చైనా నుంచి సొమ్ములు వచ్చిపడుతున్నాయన్నది సదరు రక్షణ నిపుణుడి వాదన. ఈ పత్రికలన్నీ తరచూ భారత ప్రభుత్వ వైఖరిని విమర్శిస్తూ... పరోక్షంగా చైనాకు సహకరిస్తున్నాయని ఆయన అంటున్నారు. ఇదే నిజమైతే.. ఈ కొత్త తరహా యుద్ధానికి భారత్ చెక్ చెప్పాల్సిన అవసరం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: