ధరల పెరుగుదల- కుటుంబాల ఆదాయం:
ముఖ్యంగా ధరలు పెరుగుతున్నాయి అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే అదే స్థాయిలో ప్రజల లేదా విభిన్న వర్గాల యొక్క ఆదాయాలు పెరిగనప్పుడు ప్రతినోటా ధరలు పెరుగుతున్నాయి అనే మాట వస్తుంది. ఇదే సూత్రం ఆధారంగా చేసుకుని ధరల పెరుగుదలను బట్టి ప్రైవేటు ప్రభుత్వ రంగంలోని ఉద్యోగులకు కరువు భత్యం, వేతన పెంపుదల వంటి సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారు. ధరలు పెరుగుతున్నాయి కనుక వేతనాలు పెంచమని డిమాండ్ చేయడం ఒక అంశం అయితే వేతనాలను పెంచటం ద్వారా ఉద్యోగి వర్గంలో ఉన్న వారికి మాత్రమే ప్రయోజనం జరుగుతుంది. అంతే స్థాయిలో ఆదాయాలు పెరిగనటువంటి అట్టడుగు పేద మధ్యతరగతి వర్గాలకు నిత్యావసరాలు ఇతరత్రా వస్తువుల ధరల పెరుగుదల గుదిబండగా మారి తమ కొనుగోలు శక్తి తగ్గి పేదలు మరి పేద వాళ్ళుగా తయారు అవుతారు. ఈ రకమైనటువంటి వైవిధ్యాన్ని పేదలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని సమాజం యావత్తూ ఆలోచించవలసిన అవసరం ఎంతగానో ఉన్నది.