ఈపీఎఫ్ఓ (ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్) ఢిల్లీ లోని వివిధ
విభాగాల్లో ఖాళీగా ఉన్న సుమ్మారు 280
అసిస్టెంట్ పోస్టుల
భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అర్హతలు ఉన్న వారి
నుంచీ దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: 2019, జూన్ 25 నాటికి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 2019,
జూన్ 25 నాటికి 20-27
ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ,
ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ (ఎన్సీఎల్)లకు మూడేళ్లు గరిష్ట వయో పరిమితిలో
సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు
చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్, మహిళలు, ఈడబ్ల్యూఎస్లకు రూ.250; మిగిలిన వారికి రూ.500.
ఎంపిక: ఆన్లైన్ టెస్ట్ (ప్రిలిమ్స్, మెయిన్స్) ఆధారంగా ఎంపిక
చేస్తారు.
ప్రిలిమినరీ పరీక్షతేదీ: 2019, జులై 30, 31 తేదీల్లో ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభం: మే 30, 2019.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 25, 2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.epfindia.gov.in