ఏది అసలు, ఏది నకిలీ... తెలుసుకోండి ఇలా !!
నకిలీ నోట్ల చలామణీని అడ్డుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అత్యున్నత ప్రమాణాల్లో కరెన్సీని ముద్రిస్తోంది. అయినప్పటికీ , మార్కెట్లో విచ్చలవిడిగా దొంగనోట్లు చెలామణీ అగటం లేదు.
దొంగనోట్లను కనపెట్టడానికి ఆర్బీఐ పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో ఉన్న అంశాలలో ఏ ఒక్కటి లేకున్నా అది దొంగనోటేననే నిర్ధారణకు రావొచ్చు. ఆర్బీఐ ప్రకారం నోట్లలోని ప్రధాన గుర్తులను తెలుసుకుంటే ఏది అసలు.. ఏది నకిలీ అని తేలిపోతుంది.
రూ.2వేలు నోటు ముందు ...
1. లైటు వెలుతురులో రూ.2000 అంకెను గమనించవచ్చు.
2,. దేవనాగరి లిపిలో రూ.2000 సంఖ్య ఉంటుంది
3. మధ్య భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ ఉంటుంది
4. నోటును కొంచెం వంచితే విండోడ్ సెక్యూరిటీ త్రెడ్ ఆకుపచ్చ నుంచి నీలానికి మారుతుంది. మధ్యలో భారత్, ఆర్బీఐ, రూ.2000 అంకె ఉంటుంది.
5. మహాత్మాగాంధీ బొమ్మ, ఎలక్ట్రోటైప్ (2000) వాటర్ మార్క్ ఉంటుంది
6. పైభాగంలో ఎడమ వైపున, కింది భాగంలో కుడివైపున సంఖ్యలతో కూడిన నంబర్ సైజ్ ఎడమ నుంచి కుడికి పెరుగుతుంది.
7. కుడివైపున అశోక స్తూపం చిహ్నం ఉంటుంది. అంధుల కోసం..మహాత్మాగాంధీ బొమ్మ, అశోక స్తూపం చిహ్నం, బ్లీడ్ లైన్స్, గుర్తింపు చిహ్నం చెక్కినట్లుగా లేదా ఉబ్బెత్తుగా ఉంటాయి.
8 కుడి,ఎడమ వైపున ఉబ్బెత్తుగా ముద్రించిన ఏడు బ్లీడ్ లైన్స్ ఉంటాయి.
వెనుక వైపు
9. నోటు ముద్రణ సంవత్సరం ఎడమవైపున ఉంటుంది.
10. నినాదంతో సహా స్వచ్ఛభారత్ లోగో ఉంటుంది
11. మధ్య భాగంలో భాషల ప్యానల్ ఉంటుంది
12. మంగళయాన్ చిత్రం ఉంటుంది.