డిగ్రీ పాసై.. ఉద్యోగం లేక బాధపడుతున్నారా.. అయితే ఈ వార్త మీకోసమే.. డిగ్రీ పూర్తి చేసిన వారికి వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి.. ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు. అది కూడా ఉచితంగానే.. వివరాల్లోకి వెళ్తే.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగ యువతకు ఉచిత ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు టెక్ మహీంద్రా ఫౌండేషన్ తెలిపింది.


ఈ మేరకు నిర్వాహకులు నిరంజన్ యాదవ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా టెక్ మహీంద్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో 27 ఏళ్ల లోపు ఉన్న బీకామ్ ఉత్తీర్ణులకు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తుంది. టాలీ, జీఎస్టీ, స్పోకెన్ ఇంగ్లిష్, ఇంటర్నెట్, అకౌంట్స్, అడ్వాన్స్ ఎక్సెల్ అంశాల్లో శిక్షణ ఇస్తుంది.


ట్రైనింగ్ తర్వాత ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని నిర్వాహకులు తెలిపారు. అర్హత, ఆసక్తి గల వారు ఈ నెల 18లోపు 95156 65095, 91003 30378 ఫోన్ నంబర్లు ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రకటన మీకు ఉపయోగపడకపోయినా.. మీకు తెలిసిన వారికి ఈ సందేశం ఫార్వార్డ్ చేయండి.


మరింత సమాచారం తెలుసుకోండి: