భారత ప్రభుత్వం సాంస్కృతిక శాఖకి చెందిన సెంటర్ ఫర్ కల్చరర్ రిసోర్స్ అండ్ ట్రైనింగ్ యువ కళాకారులని ప్రోశ్చహించడానికిగాను స్కాలర్షిప్ లని అందిస్తోంది. విద్యా విధానంలో మాత్రమే కాదు, భారత దేశంలో కళలకి ఉన్న ప్రాముఖ్యతని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం యుక్త వయసులోనే కళలపై ఆసక్తి చూపే వారిని ప్రోశ్చహిస్తోంది. ఈ మేరకు 2019 -20 సంవత్సరానికి గాను కళల్లో ప్రావీణ్యం ఉన్న యువ కళాకారులకి ప్రోశ్చహకాలు అందించే క్రమంలో నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలలోకి వెళ్తే..
యువ కళాకారులకి స్కాలర్షిప్ లు మొత్తం - 400
కళలు : సాంప్రదాయ సంగీతం, సాంప్రదాయ నృత్యం , మైమ్ , జానపదం, చిత్రకళ , లైట్ క్లాసిక్ , మ్యూజికల్
స్కాలర్షిప్ : 5000/-
వ్యవధి : 2 ఏళ్ళు
అర్హత : సంభందిత కళలలో డిగ్రీ పాస్ ఉండాలి. కనీసం 5 ఏళ్ళు శిక్షణ తీసుకుంటున్నట్లుగా కళాశాల లేదా గురువుగారి నుంచీ ధృవీకరణ పత్రం తీసుకోవాలి.
వయసు : 18 -25 మధ్య ఉండాలి
దరఖాస్తు విధానం : ఆన్లైన్
చివరితేదీ : 05-12-2019
మరిన్ని వివరాలకోసం : http://www.ccrtindia.gov.in/SYA-2019-20.php