భారతదేశ అత్యంత ప్రతిష్టాత్మక పార్లమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఈ ఉద్యోగాలు అత్యంత గౌరవ ప్రదంగా పరిగణించబడుతాయి. ఎంతో మంది నిరుద్యోగులు, ఉద్యోగులు సైతం పార్లమెంట్ స్థాయిలో ఉండే కొలువుల పోటీ పరీక్షలకి సిద్దమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో భాగమైన లోక్సభ సెక్రటేరియట్ వివిధ పోస్టులని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ పూర్తి వివరాలోకి వెళ్తే..
పోస్టులు : పార్లమెంట్ రిపోర్టర్
మొత్తం ఖాళీలు : 21
అర్హత : ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచీ బ్యాచలర్ డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి, అలాగే హిందీ , ఇంగ్లీష్ లో షార్ట్ హ్యాండ్ టైపింగ్ తప్పనిసరి.
ఎంపిక విధానం : షార్ట్ హ్యాండ్ టెస్ట్ , రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు చివరితేదీ : 28 -01 -2020
మరిన్ని వివరాలకోసం : http://loksabhadocs.nic.in/