కేవలం పదో తరగతి ఆధారంగా ఉద్యోగాలు తక్కువే. కానీ పదో తరగతి తర్వాత..మైనింగ్‌ సిర్ధార్‌, సర్వేయర్‌ మైనింగ్‌ లో సర్టిఫికెట్ ఉన్నవారికి నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

 

భారత ప్రభుత్వానికి చెందిన మధ్యప్రదేశ్‌ సింగ్రౌలిలోని నార్తర్న్‌ కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ ఎన్‌సీఎల్‌ పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 95 ఉన్నాయి.

 

వీటిలో మైనింగ్‌ సిర్ధార్‌-88 ఖాళీలు, సర్వేయర్‌ మైనింగ్‌-07 ఖాళీలు ఉన్నాయి. వీటికి అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత కోర్సుల్లో సర్టిఫికెట్‌ ఉండాలి.

 

వయసు: 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఫిబ్రవరి 25, 2020.

దరఖాస్తుకు చివరితేది: మార్చి 24, 2020.

 

మరిన్ని వివరాల కోసం http://nclcil.in/ వెబ్ సైట్ పరిశీలించొచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: