నేటి కాలంలో ఉద్యోగాలు లేక ఇబ్బంది ప‌డుతున్న వారు ఎంద‌రో ఉన్నారు. ఉన్న‌దంతా చ‌దువుల‌కే ఖ‌ర్చు చేసి.. ఆ త‌ర్వాత ఉద్యోగం దొర‌క్క ఎన్నో కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు ఎన్నో సంస్థ‌లు మూత‌ప‌డ్డారు. దీంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే ఇలాంటి టైమ్‌లో సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డు గుడ్ న్యూస్ తెలిపింది. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకునేవారికి మ‌రింత ఉత్సాహాన్ని ఇచ్చే వార్త‌.

 

సెంట్రల్ గవర్నమెంట్ వాటర్ బోర్డు-CGWB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. మొత్తం 62 ఖాళీలను ప్రకటించింది. జియాలజీ, ఎర్త్ సైన్స్, హైడ్రాలజీ విభాగాల్లో ఈ పోస్టులున్నాయి. జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నీటివనరులు, నది అభివృద్ధి, గంగ పునరుజ్జీవనం విభాగంలో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. 

 

అలాగే కన్సల్టెంట్ పోస్టుకు 10 ఏళ్ల అనుభవం తప్పనిసరి. ఇక మొత్తం 62 ఖాళీలు ఉండగా అందులో యంగ్ ప్రొఫెషనల్ 48, కన్సల్టెంట్- 14 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌కు మ‌రిన్ని వివ‌రాల కోసం http://cgwb.gov.in/ వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఏప్రిల్ 25 సాయంత్రం 5 గంటల్లోగా అప్లై చేయాలి. గ‌డువు చాలా త‌క్క‌వ‌గా ఉంది కాబ‌ట్టి.. ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థ‌లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: