గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూన్ 30 వ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు


1893: ఎక్సెల్సియర్ అనే పేరు గల వజ్రాన్ని (నీలం - తెలుగు రంగు 995 కేరట్స్ బరువు) కనుగొన్నారు.
1914: మహాత్మా గాంధీ ని, దక్షిణ ఆఫ్రికా లో, భారత ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో మొదటిసారిగా అరెస్టు చేసారు.
1996: 1996 యూరోకప్ ఫుట్‌బాల్ ట్రోఫీని జర్మనీ జట్టు గెలిచింది.
1935: ఆస్టరాయిడ్#1784 (బెన్గెల్లా) ని సి.జాక్సన్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు.
1936: మార్గరెట్ మిచెల్ వ్రాసిన నవల గాన్ విత్ ద విండ్ ముద్రించారు.
1936: 'వారానికి నలభై గంటల పని విధానాన్ని' అమలు చేసే ఫెడరల్ చట్టాన్ని అమెరికాలో అమలు చేయడం జరిగింది.
1940: డాల్ మెస్సిక్ తయారు చేసిన బ్రెండా స్టార్ అనే కార్టూన్ స్ట్రిప్ మొదటిసారిగా కనిపించింది.
1948: రేడియోలో వాడే ట్యూబులకి బదులుగా ట్రాన్సిస్టర్స్ని వాడవచ్చునని బెల్ లాబరేటరీస్ ప్రకటించింది.
1960: జైరీ (పూర్వపు బెల్జియన్ కాంగో) అనే దేశం, బెల్జియం నుంచి స్వాతంత్ర్యం పొందింది.
1962: రువాండా, బురుండీ అనే రెండు దేశాలు స్వాతంత్ర్యం పొందాయి.
1971: రష్యన్ వ్యోమ నౌక సోయుజ్ రోదసి నుంచి తిరిగి భూమి మీదకు వస్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు వ్యోమగాములు మరణించారు.


జననాలు

1833: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (మ.1897)
1906: త్రిభువన్, నేపాల్ రాజు (మ. 1955).
1928: జె.వి. సోమయాజులు, రంగస్థల, సినిమా, బుల్లితెర నటుడు. (మ.2004)
1934: చింతామణి నాగేశ రామచంద్ర రావు, భారతీయ శాస్త్రవేత్త, భారతరత్న పురస్కార గ్రహీత.
1939: సుంకర వెంకట ఆదినారాయణరావు, పేరుపొందిన ఎముకల వైద్యనిపుణుడు.
1941: ఉప్పలపాటి సైదులు, పౌరాణిక రంగస్థల కళాకారుడు.
1948: తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు సినిమా నిర్మాత, దర్శకులు.
1969: సనత్ జయసూర్య, శ్రీలంక క్రికెట్ క్రీడాకారుడు.
1982: అల్లరి నరేష్, సినిమా నటుడు, తెలుగు సినిమా దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.


మరణాలు

 

1897: మండపాక పార్వతీశ్వర శాస్త్రి, సంస్కృతాంధ్ర కవి, పండితులు. (జ.1833)
1917: దాదాభాయి నౌరోజీ, భారత జాతీయ నాయకుడు. (జ.1825)
1953: బలిజేపల్లి లక్ష్మీకాంతం, స్వాతంత్ర్య సమరయోధులు, అవధాని, నాటక రచయిత, రంగస్థల, సినిమా నటులు. (జ.1881)
1961: లీ డి ఫారెస్ట్, తెర మీది బొమ్మకు తగ్గట్లుగా శబ్దాన్ని జత చేసే 'ఫోనో ఫిల్మ్‌' ప్రక్రియను కనుగొన్న అమెరికన్ ఆవిష్కర్త. (జ.1873)
1967: వామన్ శ్రీనివాస్ కుడ్వ, సిండికేట్ బ్యాంకు వ్యవస్థాపకులలో ఒకరు. (జ.1899)
1984: రాయప్రోలు సుబ్బారావు, తెలుగు కవి. (జ.1892)
1988: సుత్తి వీరభద్ర రావు, తెలుగువారికి సుపరిచితమైన హాస్యనటుడు, రేడియో, నాటక కళాకారుడు. (జ.1947)
2019: నల్లగారి రామచంద్ర తెలుగు కథా రచయిత, కవి, నవల, నాటక రచయిత. (జ.1939)

మరింత సమాచారం తెలుసుకోండి: