గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో జూలై 8వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆవిశేషాలు మీకోసం

 

ముఖ్య సంఘటనలు


1497: వాస్కో డి గామా భారత దేశానికి దారి కనుక్కోవటానికి లిస్బన్ రేవుని వదిలి బయలు దేరాడు.
1954: భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, భాక్రానంగల్ ప్రాజెక్టును ప్రారంభించాడు.
2008: కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
2008: మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.


జననాలు


1838: జెప్లిన్ విమానం (ఎయిర్ షిప్) నిర్మించిన గ్రాఫ్ వాన్ జెప్లిన్
1851: ఆర్థర్ ఇవాన్స్, ఇంగ్లీషు పురాతత్వ శాస్త్రవేత్త .
1898: కుమారస్వామి రాజా, ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒడిశా గవర్నరుగా ఉన్నత పదవులను అలంకరించారు
1914: జ్యోతిబసు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి. (మ.2010)
1921: ముళ్ళపూడి హరిశ్చంద్రప్రసాద్, పారిశ్రామిక వేత్త, దార్శనికుడు (మ. 2011).
1949: వై.ఎస్.రాజశేఖరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ 16వ ముఖ్యమంత్రి, కాంగ్రేసు పార్టీ నాయకుడు. (మ.2009)
1950: రామా చంద్రమౌళి, రాష్ర్టపతి, రాష్ర్ట ప్రభుత్వం చేత ఉత్తమ ఇంజనీరింగ్‌ టీచర్‌ స్వర్ణపతక పురస్కారాలు పొందారు
1969: సుకన్య, దక్షిణ భారత సినిమా నటి.
1972: సౌరవ్ గంగూలీ, భారత క్రికెట్ మాజీ కెప్టెన్.
1966: రేవతి, భారతీయ సినీనటి.

మరణాలు


1972: పాలస్తీనాకు చెందిన రచయిత పాలస్తీనా విమోచనా ప్రజా కూటమి (Popular Front for the Liberation of Palestine) యొక్క నాయకుడు ఘసన్ కనాఫానీ
1978: నాయని సుబ్బారావు, తొలితరం తెలుగు భావకవి, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. (జ.1899)
1985: అమెరికా ఆర్థికవేత్త సైమన్ కుజ్‌నెట్స్
2006: రాజారావు, ఆంగ్ల నవలా, కథా రచయిత. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. (జ.1908)
2007: భారత మాజీ ప్రధానమంత్రి, చంద్రశేఖర్
2016: అబ్దుల్ సత్తార్ ఈది, పాకిస్థాన్‌కు చెందిన సంఘసేవకుడు, దాత. (జ.1928)

 

మరింత సమాచారం తెలుసుకోండి: