కాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఏడు యూనివర్సిటీ ల కింద ఉన్న వాటిలో పీజీ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే సీపీగెట్ పరీక్షలు డిసెంబరు 2 నుంచి మొదలుకానున్నాయి. ఈ ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష కు 85,262 మంది పోటీ పడనున్నారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాదిలో దరఖాస్తుల సంఖ్య భారీగా తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.. ముఖ్యంగా ఉత్తర భారతం నుంచి ఏటా 5,000 మంది వరకు దరఖాస్తు చేసేవారు.. ఈ ఏడాది మాత్రం 1000 లోపు అయినట్లు తెలుస్తోంది.
ఈ ఏడాదిలో హైదరాబాద్ లోని ప్రముఖ నగరాలతో పాటుగా, ప్రత్యేక కేంద్రాల్లో పరీక్షను నిర్వహిస్తున్నట్లు సమాచారం.. కరోనా వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.. పరీక్షల మధ్య 2గంటల వ్యవధి ఉన్నందున ఆ సమయం లో పరీక్షా కేంద్రాలను శానిటైజ్ చేస్తారు. సీట్ల కంటే తక్కువ దరఖాస్తులు రావడం మిలిగిన భాషలను రద్దు చేసినట్లు తెలిపారు. ఈ పరీక్ష కారణంగా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, పీజీ డిప్లొమా, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, జేఎన్టీయూహెచ్లోని రెండేళ్ల ఎమ్మెస్సీ కోర్సుల్లో సీట్లను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. పరీక్షలకు హాజరు అయ్యే వాళ్ళు కరోనా నిబంధనలను కూడా పాటించాలని అధికారులు వెల్లడించారు..