హైదరాబాద్లోని మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ లో పలు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది.జూనియర్ టెక్నీషియన్, ఆపరేటర్, జూనియర్ ఆర్టిసన్, జూనియర్ స్టాఫ్ నర్స్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 9 పోస్టులున్నాయి. హైదరాబాద్తో పాటు రోహ్తక్ ప్లాంట్లలో ఈ ఖాళీలున్నాయని ప్రకటించారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 జనవరి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఇతర వివరాలను https://midhani-india.in/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యా అర్హతలు ఉన్న వాళ్ళే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు..
దరఖాస్తు చేసుకోవడానికి మొదటి తేదీ.. జనవరి 9 తేదీ..
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జనవరి 23
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు
ఎంపిక విధానం- రాతపరీక్ష, ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్.
వేతనం- ఏడాదికి రూ.3,90,000 నుంచి రూ.4,50,000
అప్లై చేసుకొనే విధానం..
ముందుగా https://midhani-india.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేసి, అందులో కెరీర్ ను ఎంపిక చేయాలి..అందులో ఇ- రిక్వైర్మెంట్స్ పైన క్లిక్ చేయాలి.తర్వాత మిధానీ పోస్ట్ పై క్లిక్ చేయాలి..అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సెలెక్ట్ చేసి మీ వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి. దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని దాచి పెట్టుకోవాలి..