నిరుద్యోగులకు ఓ ప్రభుత్వ సంస్థ అదిరిపోయే గుడ్ న్యూస్ ను చెప్పింది.. ఆ సంస్థలో ఖాళీలు ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అదేంటంటే.. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఇటీవల వరుసగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తోంది. తాజాగా సంస్థ నుంచి మరో జాబ్స్ నోటిఫికేషన్ విడుదలైంది. 2018, 2019, 2020 ఏళ్లలో అభ్యర్థులు గేట్ స్కోర్ సాధించిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. గత ఏడాదిలో నోటిఫికేషన్ విడుదల అయిన కూడా కరోనా కారణంగా వాయిదా పడింది.


ఇంజనీరింగ్‌ విభాగాల్లో కనీసం 60% మొత్తం మార్కులతో బీఈ, బీటెక్ లేదా బీఎస్సీ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో 20, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో 40, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కంట్రోల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ లో 8, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్స్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో ఏడు, సివిల్ ఇంజనీరింగ్ లో 35, హెల్త్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్, ఫైర్ అండ్ సేఫ్టీ,మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్ విభాగంలో 85 ఖాళీలు,సేఫ్టీ అండ్ ఫైర్ సేఫ్టీ, ఫైర్ టెక్నాలజీ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్ లో 5 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు.

పూర్తి వివరాలు ఇవే..


అర్హత: ఇంజినీరింగ్

దరఖాస్తు చివరి తేదీ:ఫిబ్రవరి 23 నుంచి మార్చి 9 వరకు

ఇంటర్వ్యూ:  ఏప్రిల్ 12 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు.

అభ్యర్థులు రూ. 500 వరకు అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. కొందరికి ఫీజులో మినహాయింపు ఉంటుంది. ఆసక్తి కలిగిన విద్యార్థులు కంపెనీ వెబ్ సైట్ లో చూడవచ్చును.. గతంలో విడుదల చేసిన దానికన్నా కూడా ఈ ఏడాది ఎక్కువ పోస్టులకు దరఖాస్తు కోరుతుంది.. ఈ ఉద్యోగ అవకాశాలు నిజంగా మంచి అవకాశం అని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: