కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది నిరుద్యోగులు అయ్యారు.. ఇక ప్రస్తుతం ఉన్న  ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేయాల్సిందే. కొంతమంది గవర్నమెంట్ జాబ్స్, మరికొంతమంది ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు. మరికొంత మంది నిరుద్యోగులగా జాబ్ దొరకక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు .. అలాంటి వారికి ఒక శుభవార్త .. క్యాప్ జెమిని ఐటీ కంపెనీ ద్వారా 30 వేల ఉద్యోగాలు త్వరలో విడుదల అవుతాయని తెలిపారు. 2021లో భారతదేశంలో సుమారు 30 వేల మందిని, ఐటి ఉద్యోగులను నియమించుకోవాలని క్యాప్ జెమినీ సీఈఓ అశ్విన్ యార్డి తెలిపారు.


అంతేకాకుండా ప్రెషర్స్ తో పాటు అనుభవజ్ఞులకు కూడా అవకాశం కల్పిస్తామన్నారు. ఇంటిలిజెంట్, క్లౌడ్, 5జీ,  సైబర్ సెక్యూరిటీ,  ఇంజనీరింగ్, ఆర్ అండ్ డీ లాంటి అభివృద్ధి చెందుతున్న డిజిటల్ నైపుణ్యాల విభాగంలో  తాజా నియామకాలను చేపట్టనున్నారు.
ఇక గత సంవత్సరంతో పోలిస్తే, ఇప్పుడు 25 శాతం నియామకం  పెరిగిందని తెలిపారు. Covid -19 నేపథ్యంలో డిజిటల్ సొల్యూషన్ కు భారీ డిమాండ్ పెరిగింది. తమ వ్యాపార అవకాశాలను చాలా మెరుగుపరిచి అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అని ఆయన తెలిపారు .  డిసెంబర్ లో త్రైమాసికంలో క్యాప్ జెమినీ ఆదాయంలో 65 శాతం వాటా క్లౌడ్ బిజినెస్, డిజిటల్ సొల్యూషన్ దే కావడం గమనార్హం.


కరోనా నుంచి కోలుకుంటున్న సమయంలో వ్యాపారం, తిరిగి పుంజుకుంటుందని భారీ డీల్ సాధిస్తామనే అంచనాలతో, భవిష్యత్తులో మరికొన్ని నియామకాలను చేపట్టాలని కూడా భావిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా, ఏప్రిల్ 2020లో, మహమ్మారి పీక్స్ సమయంలో కూడా తాము వేతనాలను పెంచామని వెల్లడించారు. దేశం మొత్తంగా లక్షా 25 వేల ఉద్యోగాలు ఉన్నప్పటికీ అందులో 24000 నియామకాలు మాత్రమే చేపట్టింది.అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నియామకాలు భారీగానే పుంజుకుంటున్నాయి.

ఐటీ మేజర్ ఇన్ఫోసిస్ 15 వేల మంది గ్రాడ్యుయేట్ లను నిర్మించుకోగా,  కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ 2021లో దాదాపుగా 23,000 మంది నియమించుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 35 శాతం ఎక్కువేనట. అయితే త్వరలో నిరుద్యోగులకు ఇది ఒక చక్కటి అవకాశం లాంటిది అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: