టెన్త్, ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ కార్పొరేషన్ నుంచి వివిధ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు విడుదల అవుతున్నాయి. తాజాగా సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ప్రముఖ అమర రాజా బ్యాటరీస్ లిమిటెడ్ సంస్థలో దాదాపు 300 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు.


హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన వారికి వారం పాటు శిక్షణ అందించనున్నారు. ఈ ఉద్యోగాల కు సంబంధించి ఎంపికైన వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. చిత్తూరు జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాల ను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఇప్పుడు జరిగే ఇంటర్వ్యూ ద్వారా మొత్తం 300 ల ఖాళీలను భర్తీ చేయనున్నారు.మెషిన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు. టెన్త్ పాస్, ఇంటర్ పాస్/ఫెయిల్, ఐటీఐ పాస్/ఫెయిల్ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.


ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.10,300 వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు ఇతర అలవెన్స్  కూడా అందిస్తున్నారు.అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 27 ఉదయం 10 గంటలకు ఆ చిరునామాలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఈ నెల 25లోగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికైన వారికి వారం పాటు ట్రైనింగ్ ఉంటుంది. వారు చిత్తూరు జిల్లాలోని అమర్ రాజా కంపెనీలో పని చేయాల్సి ఉంటుంది. ఇతర ఏమైనా సందేహాలుంటే 8179541641 నంబరును ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి వేగంగా వ్యాపిస్తుంది.. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. ఆర్ధిక పరిస్థితుల నుంచి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది ఈ సంస్థ వెల్లడించింది..

మరింత సమాచారం తెలుసుకోండి: