పది, ఇంటర్ తోనే చదువు ఆపేశారా.. ఉద్యోగం చూస్తున్నారా.. అయితే ఈ ప్రకటన మీకొసమే. హైదరాబాద్ పరిధిలోని నిరుద్యోగులకు జీహెచ్ఎంసీ సంస్థ జాబ్ మేళా నిర్వహిస్తోంది. జీహెచ్ ఎంసీ మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు మూసాపేట సర్కిల్ ఉప కమిషనర్ తెలిపారు.

 

అసిస్టెంట్ సేల్స్ మెన్ ఉద్యోగాల కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2గంటలవరకు మూసాపేటలోని సర్కిల్ కార్యాలయంలోఇంటర్వ్యూలు ఉంటాయి. పదో తరగతి, ఆ పైన ఉత్తీర్ణులైన 19 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు కలిగిన యువకులు ఈ ఉద్యోగాలకు అర్హులు.

 

ఇక జీతం విషయానికి వస్తే.. ఎంపికైన వారికి నెలకు రూ.11,465 వేతనం ఉంటుంది. అదనంగా టీఏ, డీఏ కూడా ఇస్తారు. ఆసక్తి కలిగినవారు తమ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో ఈ మేళాలో పాల్గొనవచ్చు. ఇంకా వివరాలు కావాలంటే.. 80085 35309 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: