నేడు వెండి, బంగారం ధరలు పెరిగాయి : దేశ రాజధాని ఢిల్లీ లో మంగళవారం 10 గ్రాముల బంగారం ధరలు రూ.256 పెరిగి రూ. 46,580 కి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన పసిడి మెటల్ ధరల పెరుగుదల కారణంగా ఇలా రేటు పెరుగుతోంది. ఇంతకు ముందు ట్రేడ్‌ లో, ఈ విలువైన లోహం 10 గ్రాములకు రూ. 46,324 వద్ద ట్రేడవుతోంది. వెండి కూడా కిలో రూ .188 పెరిగి 62,328 కి చేరుకుంది. గత ట్రేడ్‌లో ఇది కిలోకు రూ. 62,140 గా ఉంది. ఇక హైదరాబాద్ లో బంగారం... 22 క్యారెట్లు రూ.43,300 / గ్రాములు, 24 క్యారెట్లు రూ.48,330 / గ్రాము

అంతర్జాతీయ మార్కెట్లో ధర
అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్ కు 1,782 డాలర్లుగా ఉంది. మరియు వెండి ఔన్స్ కు $ 23.72 వద్ద ఉంది.

సీనియర్ ఎనలిస్ట్ మాట్లాడుతూ కామెక్స్‌లో బంగారం ధరలు స్పాట్ గోల్డ్ ధర తో సమానంగా ట్రేడ్ అవుతున్నాయని అన్నారు. మంగళవారం ఔన్సు బంగారం ఒక శాతానికి పైగా పెరిగి 1,782 డాలర్ల కు చేరిందని అన్నారు. అనలిస్ట్ ప్రకారం బంగారం ధరల పెరుగుదలకు బలహీనమైన డాలర్, అండ్ యుఎస్ బాండ్ దిగుబడిలో తగ్గుదల మద్దతు నిచ్చింది.

దీపావళి నుండి డిసెంబర్ వరకు, బంగారం ధర 57 వేల రూపాయల నుండి 60 వేల రూపాయల వరకు పెరిగే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. అంటే ఇప్పుడు కొనసాగుతున్న ధరలు 10 గ్రాములకు వేలల్లో పెరగవచ్చు. వెండి విషయాని కొస్తే , దానిలో కూడా భారీ పెరుగుదల ఉండవచ్చు. చాలా మంది వ్యాపారులు దీపావళి నాటి కి లేదా సంవత్సరం చివరి నాటికి కిలో వెండి ధరలు రూ .76,000 నుండి రూ . 82,000 వరకు పెరుగుతుందని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: