వామ్మో.. బంగారం, వెండి ధరలు మళ్లీ భారీగా పెరిగాయ్. ఈ బంగారం ధరలు ఇప్పట్లో అసలు తగ్గేలా లేవు.. ఏకంగా 750 రూపాయలు పెరిగింది. అసలు బంగారం ధరలు అంటే ఎం అనుకుందో ఏమో.. ఇలా పెరుగుతుంది. ఇన్నాళ్లు బంగారం ధరలు అంత పెరగలేదు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు కూలిపోవడం.. ఇన్వెస్టర్లు అంత బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్ల బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇంకా ఈ నేపథ్యంలోనే బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నేడు శనివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 750 రూపాయిల పెరుగుదలతో 42,670 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 750 రూపాయిల పెరుగుదలతో 39,090 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 510 రూపాయిల తగ్గుదలతో 40,500 రూపాయిలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. కరోనా పుణ్యమా అని వెండి ధర ఏకంగా 10వేలు తగ్గింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: