బంగారం ధరలు రోజు రోజుకు కొండెక్కుతున్నాయ్.. మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు నిన్నటికి నిన్న స్వల్పంగా తగ్గాయి. అయితే ఆ తగ్గుదలకు నేడు మళ్లి బ్రేకులు పడ్డాయి. కరోనా వైరస్ కారణంగా భారీగా పెరిగిన బంగారం ధరలు ఇప్పటికి పెరుగుతూనే ఉన్నాయి.. నిన్నటికి నిన్న తగ్గినా బంగారం ధరలు ఈరోజు మళ్లీ పెరిగాయి. ఎంత పెరిగాయి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 43,910 రూపాయలకు చేరింది. ఇంకా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 10 రూపాయిల పెరుగుదలతో 40,150 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 10 రూపాయిల పెరుగుదలతో 41,000 రూపాయిలు పెరిగింది. ఇంకా దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అయితే బంగారం ధరలు పెరిగినప్పటికీ.. తగ్గినప్పటికీ ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుండటంతో కొనడానికి ఎలాంటి అవకాశం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: