బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ లు దారుణంగా కుప్పకూలిపోయాయి... దీంతో ఇన్వెస్టర్లు అందరూ కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడంతో బంగారం ధర ఒక్కసారిగా తారాస్థాయికి చేరిపోయింది. ఇంకా అలాంటి బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు కూడా బంగారం ధరలు భారీగా పెరిగిపోయాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 400 రూపాయిల పెరుగుదలతో 44,500 రూపాయలకు చేరింది. ఇంకా అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 410 రూపాయిల పెరుగుదలతో 40,840 రూపాయలకు చేరింది. 

 

బంగారం ధరలు భారీగా పెరగగా.. వెండి ధరలు కూడా అలానే పెరిగాయ్. కేజీ వెండి ధర 150 రూపాయిల పెరుగుదలతో 41,300 రూపాయలకు చేరింది. ఇలా బంగారం, వెండి ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి తప్ప తగ్గటం లేదు.. ఈ బంగారం ధరలు ఏమో సామాన్యులు కొనలేనంత భారీగా పెరిగిపోయాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: