పసిడి ప్రియులకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధర కు బ్రేకులు పడ్డాయి. నిన్న పరుగులు పెట్టిన పసిడి రేటు ఈరోజు మాత్రం పడిపోయింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలతో ఏ మాత్రం సంబంధం లేకుండా ఇండియన్ మార్కెట్ లో ధరలు కిందకు దిగి వస్తున్నాయి. ఈరోజు మహిళల ఆశలకు రెక్కలు వచ్చాయి. బంగారాన్ని కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరుతున్నారు..


హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర పడిపోయింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.700 దిగొచ్చింది. దీంతో రేటు రూ.45,600కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.650 క్షీణతతో రూ.41,800కు దిగొచ్చింది. బంగారం ధర పడిపోతే.. వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర కేజీకి రూ.2400 పతనమైంది. దీంతో రేటు రూ.70,400కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ముఖ్య కారణం అని చెప్పవచ్చు..


అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు చూస్తే.. బంగారం ధర ఔన్స్‌కు 0.83 శాతం తగ్గుదలతో 1686 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. ఔన్స్‌కు 1.14 శాతం తగ్గుదలతో 25.16 డాలర్లకు దిగొచ్చింది.ప్రస్తుతం బంగారం కొనుగోలు చేయడానికి ఇదే మంచి అవకాశమని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే రెండు నెలల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయన్నారు. బంగారం కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇదే మంచి అవకాశమన్నారు. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరల మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, భౌగోళిక ఉద్రిక్తత, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాల ప్రభావం వల్ల పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: