పుత్తడి కొనుగోలు చేసేవారికి చేదువార్త.. గత కొద్ది రోజులుగా స్థిరంగా కొనసాగుతున్న బంగారం ధరలు  నిన్న కాస్త దిగివచ్చింది.. అయితే, నేటి మార్కెట్ లో  పైకి కదిలాయి. పసిడి పరుగులు పెట్టింది.మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన బంగారం ధర ఈరోజు పెరగడం గమనార్హం. పసిడి పైకి కదిలితే వెండి కూడా ఇదే దారిలో పయనించింది. ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు పెరగడం తో మహిళలు కాస్త నిరాశకు లోనయ్యారు. ఉగాదికి ధరలు కిందకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మహిళలు ఆభరణాలు కొనడం మాత్రం ఆపలేదు.


కాగా, హైదరబాద్ మార్కెట్ లో శుక్రవారం బంగారం ధర పైకి కదిలింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 క్షీణించింది. దీంతో రేటు రూ.45,940కు దిగొచ్చింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.110 క్షీణతతో రూ.42,110కు చేరింది. పసిడి ధరలు తగ్గితే.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. వెండి ధర భారీగా దిగొచ్చింది. రూ. 100 తగ్గింది. దీంతో రేటు రూ.71,400కు క్షీణించింది.


పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఉండటం వెండి రేటు పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక అంతర్జాతీయ మార్కెట్ లో వెండి, బంగారం ధరలను చూస్తే..బంగారం ధర తగ్గింది. బంగారం ధర ఔన్స్‌కు 0.22 శాతం తగ్గుదలతో 1728 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర క్షీణిస్తే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 1.26 శాతం క్షీణతతో 26.01 డాలర్లకు తగ్గింది.. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరల పెరుగుదల పై ప్రభావాన్ని చూపిస్తున్నాయి... జూన్ లో ధరలు కిందకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: