బంగారం కొనాలని అనుకునేవారికి భారీ షాక్.. బంగారం ధరలు భారీగా పైకి కదిలాయి. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు మార్కెట్ లో మరింత పెరిగాయి.ఈరోజు ధరలకు రెక్కలు వచ్చాయి.. రెండు రోజుల నుంచి ఈ రేట్లు కాస్త ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి.. బంగారం ధర వరుసగా రెండో రోజు కూడా పైకి కదిలింది. బంగారం ధర బాటలోనే వెండి రేటు కూడా నడిచింది. వెండి ధర భారీగా పెరిగింది.. అయిన కూడా మార్కెట్ లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు మహిళలు  ఆసక్తి చూపిస్తున్నారు..


 హైదరాబాద్ మార్కెట్‌ లో శుక్రవారం బంగారం ధర పైపైకి కదిలింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.110 పెరిగింది. రూ. 48,000 కు చేరింది. అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 పెరుగుదల తో రూ.44,000కు ఎగసింది. బంగారం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వెండి ధరలు కూడా పైకి కదిలాయి. బంగారం ధరల పైనే వెండి ధరలు ఆధారపడి ఉన్నాయి..



గత మూడు రోజుల నుంచి పెరుగుతూ వచ్చిన కిలో వెండి ధర మాత్రం ఈరోజు కూడా షాక్ ఇచ్చింది.. కేజీ వెండి ధర రూ.74,200 కు ఎగసింది. అంటే తులం వెండి ధర దాదాపు రూ.740 వద్ద ఉందని చెప్పుకోవచ్చు. కాగా వెండి ధర గత ఏడాది ఏకంగా రూ.79 వేల వరకు పెరిగిన విషయం తెలిసిందే.  వెండి ధర ఔన్స్ ‌కు 0.33 శాతం తగ్గుదల తో 27.38 డాలర్లకు క్షీణించింది.. బంగారం ధర ఔన్స్‌కు 0.03 శాతం తగ్గుదల తో 1815 డాలర్ల కు క్షీణించింది.. మొత్తానికి మళ్లీ బంగారం రేట్లు పెరిగేలా ఉన్నాయని అంటున్నారు ..మరి మార్కెట్ లో గోల్డ్ రేట్లు ఎలా నమోదు ఆవుతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: