ఈ రోజుల్లో చాలా మంది ఎక్కువగా మైగ్రేన్ సమస్యతో చాలా తీవ్రంగా సతమతమవుతూ వుంటారు. అధిక తల నొప్పి కారణంగా నరకయాతన పడుతూ వుంటారు. ఇక ఈ సమస్యలు ప్రధానంగా అధికంగా ఆలోచించడం వల్ల లేదా ఎక్కువగా ఆందోళన చెందడం వలన లేదా హార్మోన్ల మార్పుల వల్ల వస్తాయి.ఇక చాలా మంది నిపుణులు కూడా సరైన ఆహారం తీసుకోవడం వల్ల మైగ్రేన్లు లేదా తలనొప్పి నయం అవుటుందని చెబుతూ వుంటారు.మైగ్రేన్లను తగ్గించడంలో సరైన ఇంకా పోషకమైన ఆహారం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని అనేక అధ్యయనాలు  నిరూపించడం జరిగింది. సరైన ఆహారం తింటే మైగ్రేన్ల ఫ్రీక్వెన్సీని తగ్గించడం సాధ్యపడుతుందట. ఖనిజాలు, విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాల్సి ఉంటుందట.

మైగ్రేన్ సమస్య తగ్గడానికి ఖచ్చితంగా సాల్మన్ ఫిష్ తినాలట. సాల్మన్ ఫిష్ ఒమేగా -3(Omega-3) కొవ్వు ఆమ్లాలను పుష్కలంగా కలిగి ఉంటుంది. ఈ ఫిష్ ప్రాథమికంగా మైగ్రేన్ తల నొప్పిని తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇక పొడి గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివట. పొడి గింజల్లో మెగ్నీషియం అలాగే ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ప్రతిరోజూ కూడా పొడి గింజలు కనుక తింటే, మైగ్రేన్ సమస్య పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుందట. ఇక అలాగే బాదం పప్పు , అక్రోట్లను, గుమ్మడికాయ గింజలను మొదలైనవి పొడి గింజలు తింటే తలలో నరాలు చాలా దృఢంగా ఉండి తల నొప్పి రాకుండా ఉంటుందట.ఆకుపచ్చ కూరగాయలు కూడా మైగ్రేన్ సమస్యను తగ్గిస్తుందట. ఇక మైగ్రేన్ సమస్యల నుంచి బయటపడటానికి రోజు కూడా ఆకుపచ్చ కూరగాయలు తినడం చాలా ముఖ్యమట. ఇక వాటిలో బచ్చలికూర ఒకటని చెప్పాలి. బచ్చలికూరలో విటమిన్ బి, మెగ్నీషియం(Magnesium) అలాగే ఫోలిక్ యాసిడ్(Folic Acid) సమృద్ధిగా ఉంటాయి. ఇది ఖచ్చితంగా మైగ్రేన్ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: