ఇక వానా కాలంలో ఆకుకూరలకు ఎక్కువగా బ్యాక్టీరియల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం చాలా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇన్ఫెక్షన్ సోకిన ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు చాలా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు వానా కాలంలో ఆకుకూరలను తక్కువగా తీసుకోవడం చాలా మంచిది.ఇక వీటిలో పైపైరిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. ఇది వివిధ ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కలిగి ఉంటుంది. అలాగే ఇది గణనీయంగా విటమిన్ సి, ఇంకా విటమిన్ కెలను అందిస్తుంది. పచ్చిమిరియాలలో యాంటీఆక్సిడెంట్లు అనేవి చాలా ఉంటాయి. ఇవి అనేక వ్యాధులను కూడా నిరోధిస్తాయి. అలాగే పచ్చిమిరియాలు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తిని బాగా ఉత్తేజపరుస్తాయి. ఇవి ఆహార జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తాయి.ఇక అలాగే ఇవి యాంటీమైక్రోబియల్ లక్షణాలను కూడా చాలా ఎక్కువగా కలిగి ఉంటాయి. దీంతో ఆహారం ద్వారా వచ్చే అనేక అనారోగ్యాలకు కారణమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి.అలాగే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాన్ని తగ్గిస్తాయి.

ఇక వర్షాకాలంలో చాలా ఎక్కువగా సీజనల్ పండ్లు అంటే బొప్పాయి, నేరేడు, చెర్రీలు, దానిమ్మ ఇంకా పీచెస్ వంటివి తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్లు అనేవి ఎక్కువగా ఉంటాయి.ఇక ఈ సీజన్‌లో రోడ్డు పక్కన ముందస్తుగా కట్ చేయబడ్డ పండ్లు ఇంకా జ్యూస్‌లను ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోకూడదు. అలాగే నాణ్యమైన తాజా పండ్లను తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే ఈజీగా కాపాడుకోవచ్చు.వానా కాలంలో సూప్, మసాలా టీ ఇంకా గ్రీన్ టీ వంటి వెచ్చగా ఉండే ద్రవాలను పుష్కలంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇవి రీహైడ్రేషన్‌కు చాలా మంచివి. అంతేకాకుండా ఇవి శరీరంలో రోగనిరోధక వ్యవస్థలో చాలా కీలకపాత్రని పోషిస్తాయి. అలాగే హెర్బల్ టీ లేదా కషాయాలను తాగ‌డం వల్ల మీ రోగనిరోధక శక్తి అనేది మరింత శక్తివంతంగా మెరుగుప‌డుతుంది. ఇక దీని కోసం పసుపు, తులసి, అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క ఇంకా నల్ల ఉప్పును నీటిలో వేసి బాగా మరిగించాలి.ఇక ఆ తర్వాత దానిలో నిమ్మరసం అలాగే తేనెని కలుపుకోని తాగితే చాలా రకాల వ్యాధులను ఈజీగా అరికట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: