భారత్ లో రెండు వాక్సిన్ లు తయారవడంపై పలు దేశాలకు ఈ విషయం మింగుడు పడటం లేదు. అసలు కరోనా తో భారత్ అల్లాడిపోతోంది అనేది మొదట్లో ప్రపంచం ఆలోచన, కానీ భారత్ లో జనాభా అధికంగా ఉండటంతో ముందస్తు జాగర్తలతో చాలా వరకు కరోనా కోరల నుండి తప్పించుకుంది. ఇది కూడా భారత్ పై పలు దేశాలు గుర్రుగా ఉండటానికి కారణం అయ్యింది. నిజానికి ఒక ప్రమాదం నుండి తోటివారు తప్పించుకుంటే సంతోషపడాలి, కానీ భారత్ ఈ రెండు విజయాలు సాధించినందుకు చాలా దేశాలు లోలోపల నలిగిపోతున్నాయి. భారత్ ఎక్కడ గొప్ప శక్తిగా ఎదుగుతుందో అనేది వారి ఏడుపు.
ఈ వరుసలో చైనా, పాక్ సహా పలు దేశాలు ఉన్నాయన్నది అందరికి తెలిసిందే. భారత్ ను ఎలాగైనా నిలువరించాలి అనేది ఆయా దేశాల ప్రణాళిక. ఆఫ్ఘన్ ఆక్రమణ కూడా అందులో భాగమే. అమెరికా ప్రస్తుత నాయకత్వం కూడా భారత్ పై పలు ఆంక్షలు పెట్టె అవకాశాలు ఉన్నాయి. అందుకే మోడీ అమెరికా టూర్ వెళ్లాల్సి వచ్చింది. అమెరికా బూస్టర్ ఉత్పత్తి కూడా అటువంటిదే. బూస్టర్ పేరుమీద వ్యాపారం చేయడం ప్రారంభించింది. దానిని ప్రస్తుతం పెద్ద వారికి (65ఏళ్ళు) మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఫైజర్ తీసుకున్న ఆరునెలల తరువాత తీసుకోవాలని సూచించింది అక్కడి ఆరోగ్యశాఖ. షెల్టర్ వంటి వాటిలో అంటే కరోనా సోకె అవకాశాలు ఎక్కువగా ఉన్న వారికి కూడా ఈ బూస్టర్ డోస్ ఇవ్వవచ్చు అని సూచించారు.