కరోనా వైరస్ వచ్చిన అనంతరం అందరికి కనిపించిన దారి ఒక్కటే, అదే ముందస్తు జాగర్త. ఎందుకంటే అప్పటికి అదేమిటో కూడా ఎవరికి తెలిసిరాలేదు. అందుకే మందులు కూడా ఏమేమి వాడాలి అనేది కూడా స్పష్టత లేదు. ఒకసారి వైద్య శాస్త్రవేత్తలు ప్రాథమిక పరిశోధన అనంతరం కొన్ని అప్పటికే ఉన్న ఔషదాలు ఈ వైరస్ కోసం వాడుకోవచ్చు అని తేల్చి చెప్పడంతో వాడుకున్నారు. అదే పరిశోధనలు మరో అడుగు ముందుకు వేయడంతో వాక్సిన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే అప్పటికే వైరస్ లో వేరియంట్లు బయలుదేరాయి. దానితో కనుక్కున్న వాక్సిన్ పనిచేస్తుందా లేదా అనే సందేహాలు కూడా బయలుదేరాయి. అయినా వాక్సిన్ కాస్త సమర్థవంతంగా మనిషి ప్రాణాపాయం లేకుండా చూస్తుంది అనే ధీమా రావడంతో అప్పటి నుండి వాక్సిన్ ఉత్పత్తి కూడా భారీగా జరిగింది.

దానికి తగ్గట్టుగానే పంపిణి కూడా ప్రారంభించారు. అయితే ముందుగా ఫ్రంట్ లైన్ వారికి దానిని ఇవ్వగా అనంతరం పెద్దలకు ఇస్తూ వచ్చారు. తరువాత 18 ఏళ్ళు దాటినా వారికి పంపిణి ఇప్పటికి జరుగుతూనే ఉంది. అయితే ఈ టీకాలు అన్ని కేవలం ఉపశమనం తప్ప శాశ్వత పరిష్కారం కాదని వైద్యులు ముందుగానే స్పష్టం చేశారు. అయినా తాత్కాలికంగా అయినా అందరికి వాక్సిన్ ఇవ్వడానికి ఉత్పత్తి దారులు అందరు ప్రయత్నిస్తున్నారు. ఆయా ప్రభుత్వాలు టీకాలను ప్రజలకు అందిస్తూ వస్తున్నాయి. ఇప్పటి వరకు కొన్ని దేశాలలో రెండు వేవ్ లు పూర్తికాగా మొదటి వేవ్ లో పెద్దలను, రెండో వేవ్ లో యువకులను లక్ష్యం చేసుకుంది వైరస్. అయితే ఈసారి వేవ్ లో పిల్లలపై ప్రభావం ఉంటుందని వైద్యులు అంచనా వేశారు.  

పిల్లలకు వైరస్ సోకినప్పటికీ ప్రాణాపాయం ఉండబోదని, సాధారణంగా పిల్లలలో ఉండే బలమైన రక్షణ వ్యవస్థ అందుకు కారణం అని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ ముందస్తు జాగర్తలు తీసుకోవాల్సినదిగా హెచ్చరించారు. అయితే పిల్లల కోసం కూడా వాక్సిన్ ప్రయోగ దశలో ఉంది. మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నారు. మరోపక్క థర్డ్ వేవ్ ముంగిట ఉండటంతో దాని నుండి పిల్లలను రక్షించడానికి ఆయా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు. తాజాగా అమెరికా కూడా ఫైజర్ టీకా పిల్లలపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు స్పష్టం చేసింది.  ఈ మేరకు అక్కడి ఆరోగ్యఔషద సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఐదు నుండి పదేళ్ల వయసు ఉన్నవారికి ఈ వాక్సిన్ ఇవ్వవచ్చు అని వారు అంటున్నారు. వచ్చే నెల మొదటి వారం నుండి ఈ టీకా అక్కడ అందుబాటులోకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: