కరోనా అంతం ఎప్పుడు అని అందరు నన్ను అది వచ్చినప్పటి నుండి అడుగుతూనే ఉన్నారు. నేను కూడా అప్పటి నుండి చెపుతూనే ఉన్నాను, మనం ముందస్తు జాగర్తలు పాటించడం వలన అదే వెళ్ళిపోతుంది అని. కానీ ఎవరూ దానిని పట్టించుకోవడం లేదు. కాస్త తగ్గుముఖం పట్టగానే బయటకు వచ్చేస్తున్నారు, నిబంధనలు పాటించకుండా తిరిగేస్తున్నారు. దీనితో మళ్ళీ అది విజృంభిస్తుంది. ఇలా అయితే మనిషి ఉన్నంత కాలం అది ఉంటుంది. దానిని పూర్తిగా వెళ్ళగొట్టాలి అంటే మనిషి ముందు నిబంధనలు కనీసం ఏడాదైనా పాటించాల్సి ఉంటుంది. అది లేకపోబట్టే ఇప్పటికి రోజు సాలీనా 50000 మంది ప్రపంచ వ్యాప్తంగా మృతి చెందుతూనే ఉన్నారు.

మహమ్మారి ని తరిమికొట్టడానికి మన వద్ద అన్నీ ఉన్నప్పటికీ కేవలం అజాగర్త వలన రోజూ ఇంతమంది మృతికి కారణం అవుతున్నాం. ఈ విషయం ప్రపంచం ఎప్పుడు తెలుసుకుంటుందో అప్పుడే దానిని అంతం చేయడం ప్రారంభం అయినట్టు. మనిషి దగ్గర సమర్ధవంతమైన ఔషదాలు, సాధనాలు, వంటివి ఎన్నో ఉన్నప్పటికీ, కాస్త నిబంధనలు పాటించే ఓపిక మాత్రం ఉండటం లేదు. అదొక్కటి తోడైతే వీలైనంత త్వరగా దానిని ప్రపంచం నుండి తరిమేసి, మళ్ళీ అందరు సాధారణ జీవితం గడపడానికి అవకాశాలు ఏర్పడతాయి. లేదంటే ఒకచోట విజృంభించినా అది ఎప్పడు ఇతర ప్రాంతాలకు పాకేస్తుందో చెప్పడానికి వీలులేదు.  

నిర్లక్ష్యంతో అందరు ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. కరోనా ముందు సంపన్నులు, బీదలు అనే తేడా లేదని ఇప్పటికే అర్ధం అయ్యింది. ఏ దేశం ఏ వాతావరణం కూడా దానిని ఏమి చేయలేకపోతోంది, కేవలం ముందస్తు జాగర్తలు మాత్రమే ఉన్న దారి. అదే సరిగా లేకపోవడం వలన ఇంకా అది మనిషిని పీడిస్తూనే ఉంది. ఒక్కటి ప్రపంచం అంతా గుర్తుంచుకోవాలి, ఇంకా వేరియంట్లు వస్తూనే ఉన్నాయి, వాక్సినేషన్ అయిపోయింది కదా, నాకేమి కాదు అనుకుంటూ నిబంధనలు పాటించడం మానేస్తే మరోసారి పాండమిక్ లాక్ డౌన్ తప్పవని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: