అయితే సరిగ్గా నిద్రపోకపోతే ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉంటారు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరికి ఆరోగ్యం గురించి పట్టించుకునే సమయం లేకుండా పోయింది. దీంతో నిద్ర పోవడానికి సరైన సమయం కేటాయించడం లేదు. అదే సమయంలో నేటి రోజుల్లో మొబైల్ వాడకం ఎక్కువగా పెరిగిపోయింది. అదే సమయంలో అటు టీవీలు కూడా చూసే వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో నిద్రపోయే సమయాన్ని కూడా వీటిని వాడుతూ గడిపేస్తున్నారు ఎంతోమంది. తద్వారా నేటి రోజుల్లో ఎవరూ కూడా కంటి నిండా నిద్ర పోవట్లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
అయితే నిద్ర విషయంలో నిర్లక్ష్యం వహిస్తు కంటినిండా నిద్ర పోకుండా నిద్రపోయే సమయాన్ని కూడా టీవీలు, ఫోన్లకు కేటాయించే వారికి ఇటీవలే వాషింగ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు షాకింగ్ విషయం చెప్పారు. సరైన నిద్ర లేకపోవడం వల్ల మెదడు పై ప్రత్యక్ష ప్రభావం పడుతుంది అంటూ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ ప్రభావం కారణంగా ఆలోచన శక్తి తగ్గుతుందని, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుందని, పూర్తిగా ఆలోచనలు గందరగోళంగా మారిపోతాయని నిపుణులు తెలిపారు. ప్రతిరోజూ ఏడున్నర గంటలకు తక్కువ కాకుండా నిద్రపోవడం ఎంతో మంచిదని సూచించారు.