దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది. అక్కడ వాయు కాలుష్యానికి పంజాబ్ హర్యానా సహా పాకిస్తాన్ నుంచి వెలువడుతున్న పొగ కూడా కారణమేనని తాజాగా నాసా పంపించిన చిత్రాలతో తెలిసింది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేసిన ఈ అంచనాలు ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. నగరంలో పరిశ్రమలు వాహన కాలుష్యానికి పాకిస్తాన్ నుంచి వస్తున్న పొగ కూడా తోడైందని ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా వెల్లడైందని తెలిపింది. ఈ కాలుష్యం కారణంగా నగర ప్రజలు శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటు న్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు.ప్రతి సంవత్సరం నవంబర్ డిసెంబర్ నెలలో ఇంత భారీ స్థాయిలో నమోదవుతుందని నాసా వెల్లడించింది.

ఢిల్లీలో వాయు కాలుష్యానికి వాహనాలతో పాటు పక్కనే ఉన్న పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు కాల్చే పంట వ్యర్థాలు, బాణసంచా కాల్చడం లాంటి ప్రధాన కారణాలని ఇన్నాళ్లు  చెబుతూ వచ్చారు, విజిబుల్ ఇన్ఫ్రాడరీ ఇమేజింగ్ రేడియో మీటర్ సూట్ ద్వారా ఈ నెల 11 నాటి పరిస్థితిని నాసా పరిశీలించింది. షోవోమీ ఎంపీపీ సాటిలైట్ ద్వారా వాయు కాలుష్య మూలాలను ఫోటోలు తీసింది. పంజాబ్, హర్యానాల్లో పంట వ్యర్థాల నుంచి వచ్చే పొగ తో పాటు పాకిస్తాన్ నుంచి వస్తున్న పొగలు కూడా ఈ స్థాయి కాలుష్యానికి కారణమైనని నాసా చెబుతోంది. వాయు కాలుష్యంతో మనుషుల ప్రాణాలకు ముప్పు ఉందని చెబుతోంది. పొగ కారణంగా ఈ నెల 11న దాదాపు2.2 కోట్ల మంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని నాసా  శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ నెల 12 న దాని ప్రభావం మరింత ఎక్కువగా ఉన్నట్టు చెబుతున్నారు. థార్ ఎడారి నుంచి కొట్టుకొచ్చిన దుమ్ము,ధూళి, వాహన, నిర్మాణ, టపాసుల కాలుష్యం సైతం తీవ్రతకు కారణమైనట్టు వెల్లడించారు. ఢిల్లీలోని సెన్సార్లు ఈ నెలలో చాలా సందర్భాల్లో క్యూబిక్ మీటర్ కు 400 మైక్రోగ్రాముల కు మించి pm 2.5, pm10 స్తాయిలు నమోదు చేశాయని నాసా తెలిపింది.

 ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన క్యూబిక్ మీటర్ కు 15 మైక్రోగ్రాములు  ఎక్కువ అని వివరించింది ఉత్తర పాకిస్తాన్ లో పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల భారీగా వెలువడుతున్న పొగ కూడా ఈ కాలుష్యం పెరుగుదలకు కారణమని తెలిపింది. ఢిల్లీ దాని చుట్టుపక్కల నివసిస్తున్న 3 కోట్ల మంది ప్రజలు వారానికి పైగా ప్రమాదకర పొగమంచుతో పోరాడుతున్నారు. ఉత్తరభారతంలో విస్తరించి ఉన్న గంగానది మైదాన ప్రాంతం కూడా ఈ కాలుష్యానికి బాగా ప్రభావితం అయింది,భారత్ పొరుగునున్న నేపాల్, బంగ్లాదేశ్ కూడా ప్రమాదానికి గురవుతున్నాయి ఎందుకంటే ఈ కాలుష్య గాలులు, దూళి హిమాలయాల వరకూ పయనిస్తూ ఉండటం ఆందోళనకరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: