తాజా సర్వే ప్రకారం.. మహారాష్ట్ర, గుజరాత్, త్రిపుర, లక్ష్యద్వీప్, జమ్మూకశ్మీర్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, బెంగాల్, ఆంధ్రప్రదేశ్, లద్దాఖ్ లో ఐదేళ్లు ఉన్న పిల్లల్లో అధిక బరువు ఉన్న వారి సంఖ్య పెరిగింది. గోవా, తమిళనాడు, దాద్రానగర్ హవేలి, దమన్ అండ్ డయ్యూ దీవుల్లో మాత్రమ ఐదేళ్లల్లో పిల్లల్లో ఊబకాయం తగ్గిందని వెల్లడయింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మహిళా స్థూలకాయులు, పురుషుల్లో ఊబకాయులు పెరిగారు. చిన్నారులు, పెద్దవారిలో బరువు పెరగడానికి శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపద్దతులే కారణం అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
గత 15 ఏళ్లలో ఆర్థిక స్థిరత్వం కారణంగా ప్రజల ఆదాయాలు పెరిగాయి. ఆర్థికంగా ఎదగడమే భారతీయుల్లో ఊబకాయం పెరగడమే కారణం అని అందరికీ తెలిసిందే. కరోనా ముందుతో పోలిస్తే ఆ తరువాత పిల్లల్లో ఎక్కువ మంది ఊబకాయం భారిన పడినట్లు అమెరికా వైద్య సంఘం అధ్యయనంలో తేలింది. గడిచిన 50 సంవత్సరాల్లో ఊబకాయం మూడు రేట్లు పెరిగినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అధికంగా చైనాలో పిల్లలు అధికంగా ఊబకాయంతో బాధపడుతున్నారు.