రుచికరమైన పండ్లలో పైనాపిల్ ఒకటి. పైనాపిల్ తినడానికి తియ్యగా, పుల్లగా రుచికరంగా ఉంటుంది. దానిలో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం నిల్వలు ఉంటాయి. అదేవిధంగా వీటిలో విటమిన్స్, పోషకాలు విరివిగా లభిస్తాయి. ఎన్నో పోషక విలువలు కలిగిన పైనాపిల్ తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మనం సొంతం చేసుకోవచ్చు. పైనాపిల్ లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మధుమేహం, హృదయసంబంధ వ్యాధులు, క్యాన్సర్ కారకాలైన ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది.

దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యలను దూరం చేస్తాయి. మన శరీరంలో ఏర్పడే అధిక రక్తపోటు నియంంత్రించడానికి కూడా పైనాపిల్ ఎంతో కీలకపాత్ర వహిస్తుంది. దీనిలో ఉండే బ్రోమిలైన్ అనే ఎంజైమ్ క్యాన్సర్ పేషెంట్ లో కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఇటీవల పరిశోధనలో భాగంగా పైనాపిల్ లోని బీటా కెరోటిన్ ప్రోస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుందని వెల్లడైంది మధుమేహం, హృదయ సమస్యలు, దంత సమస్యలతో బాధపడే వారికి పైనాపిల్ ఎంతో ప్రయోజనకరం. విపరీతమైన వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల  త్వరగా వాటి నుంచి విముక్తి పొందవచ్చు.  బాగా పండిన పైనాపిల్ ను రోజు తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అదేవిధంగా బాలింతలు పైనాపిల్ తినడం వల్లపిల్లలకు కావాల్సినంత పాలు ఉత్పత్తి జరుగుతాయి. పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందడం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పని చేయడంలో సహాయపడుతుంది. ఇది జుట్టురాలడం తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఆడపిల్లయితే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.

పండిన పైనాపిల్ పండ్లు తింటూ ఉంటే పళ్ల నుంచి రక్తం కారే స్కర్వి వ్యాధి నుంచి రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండరి పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. పైనాపిల్ లోని ఎంజైమ్స్ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్ ను ఉపసంహారణం చేస్తుంది. పచ్చి పైనాపిల్ రసాన్ని తెగిన గాయాలపై వేస్తే రక్తస్రావాన్ని అరికడుతుంది. పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులు ఉన్నవారు  ప్రతిరోజు ఈ రసాన్ని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. పైనాపిల్లో అమినోయాసిడ్ టైపోటన్ రిచ్ గా ఉండడం వల్ల హార్మోన్ల ఆరోగ్యానికి మంచిది. న్యూరో లాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండడానికి పైనాపిల్ లో ఉండే పోషకాలు ఉపయోగపడతాయి. వీటి ద్వారా పాజిటివ్  హార్మోన్లకు శక్తి వస్తుంది. పైనాపిల్ పండు రసాన్ని ముఖానికి రాసుకొని మర్దనా చేస్తే ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు, ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: