గుమ్మడి పండు కోశాక అందులోని గింజలను తీసి ఎండబెడతారు. తర్వాత వాటిని స్టోర్ చేసుకొని నచ్చినట్టు తింటారు. చిన్నపాటి స్వీట్ నెస్ తో నోరూరిస్తుంది. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ను అందిస్తుంది. వీటిలో జింక్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, కాపర్, నియాసిన్,ట్రిప్టోఫాన్ వంటి న్యూట్రియంట్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాటి యాసిడ్స్ లాంటివి రక్తనాళాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడానికి కూడా ఇవి బాగా యూజ్ అవుతాయి. 30 గ్రాముల గుమ్మడి గింజల్లో సుమారు 150 కేలరీలు ఎనర్జీ ఉంటుంది. అందుకే వీటిని న్యూట్రిషన్ పవర్ హౌస్ అని అంటారు.అతి ఎప్పుడూ అనర్థదాయకమే అన్న మాట వీటిని తినేటప్పుడు గుర్తించుకోవాలి.

దొరకాయి కదా అని లాగించేస్తే తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తో చాలా ఇబ్బంది పడాలి.అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు రోజు 30 గ్రాములకు మించి తినడం మంచిది కాదని చెప్పారు. అంతకన్నా ఎక్కువ తింటే మేలు కన్నా కీడే ఎక్కువ అంటున్నారు. గుమ్మడి గింజలు ఎక్కువగా తింటే ముందు కడుపు నొప్పి వస్తుంది.కడుపు ఉబ్బరం, గ్యాస్ ఫామ్ అవుతుంది.వీటిలోని ఫ్యాటి ఆయిల్స్ వల్ల ఈ సమస్య ఎక్కువగా అవ్వచ్చు.కొంతమందికి ఇవి అలర్జీని కలిగిస్తాయి. గొంతులో ఇరిటేషన్, దగ్గు, కఫం చేరే అవకాశం ఉంది.ఒక్కోసారి తలనొప్పి కూడా వస్తుంది.ఈ గింజల్లో పోషకాలు, క్యాలరీలు ఎక్కువగా ఉండటం వల్ల బరువు తొందరగా పెరుగుతారు.

సన్నబడాలని అనుకుంటే మాత్రం వీటిని తినకపోవడమే బెటర్లో బీపీ ఉన్నవాళ్లు వీటిని తినడం మంచిది కాదు. వీటిలో యాంటీఆక్సిడెంట్ల వల్ల బిపి మరింత తగ్గే అవకాశం ఉంది.తినాలని అనుకుంటే మాత్రం డాక్టర్ సలహా తీసుకోవాలి. మూడేళ్ళ లోపు పిల్లలకు వీటిని పెట్టద్దు.వీటిలోని ఫైబర్, ఫ్యాటి యాసిడ్ల వల్ల కడుపు నొప్పి, డయేరియా వంటి సమస్యలు రావచ్చు. గుమ్మడి గింజల్లోని పోషకాలు మిస్ అవ్వకూడదు అనుకుంటే.. సలాడ్స్ లాంటి వాటిలో కలిపి తీసుకుంటే మంచిది. సన్నగా గ్రైండ్ చేసి స్నాక్స్, జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ మీద చల్లి తిన్నా బాగుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: